English | Telugu

100 కోట్ల క్లబ్ లో పవన్ కళ్యాణ్.. ఇది కదా పవర్ స్టార్ రేంజ్ అంటే!

పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న కొందరు తెలుగు స్టార్స్ రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకుండానే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ ఫీట్ సాధించడం విశేషం. ప్రస్తుతం పవన్ నటిసున్న 'ఓజీ' కోసం ఆయన ఏకంగా వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఓజీ'. 'ఆర్ఆర్ఆర్' వంటి సంచలన విజయం తర్వాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. గ్యాంగ్ స్టర్ మూవీగా తెరకెక్కుతోన్న 'ఓజీ'పై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేవలం అనౌన్స్ పోస్టర్, సెట్స్ నుంచి విడుదలైన ఫొటోలతోనే అభిమానులు ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాపై నిర్మాత డీవీవీ దానయ్య సైతం అంతకుమించిన నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కి ఏకంగా వంద కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలకానప్పటికీ, ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం పవన్ కే సాధ్యమవుతుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అంతేకాదు ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇస్తున్నప్పటికీ, డీవీవీ దానయ్యలో ఏమాత్రం ఆందోళన లేదట. ఎందుకంటే కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ కోసమే ఈ సినిమాకి రికార్డు స్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయట. థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో విడుదలకు ముందే ఆయన భారీ లాభాలను పొందే అవకాశముంది అంటున్నారు.

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .