English | Telugu

ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు..అందుకే పార్ట్ 2 చెయ్యటం లేదు

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)కెరీర్ లో ఉన్న ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ లో 'అదుర్స్'(Adhurs)కూడా ఒకటి.అయితే మిగతా సినిమాల హిట్ కి 'అదుర్స్' హిట్ కి ఎంతో ప్రత్యేకత ఉంది.చారి,నరసింహ అనే రెండు వైవిధ్యంతో కూడుకున్న క్యారక్టర్ లలో అవలీలగా నటించి టైటిల్ కి తగ్గట్టే అదుర్స్ అనిపించాడు.ముఖ్యంగా చారి క్యారక్టర్ ద్వారా తనలో ఉన్నకామెడీ యాంగిల్ ని ప్రేక్షకులకి పరిచయం చేసి కామెడీ ని పండించడంలో కూడా తిరుగులేదని నిరూపించాడు.చారిగా ఎన్టీఆర్ పలికించిన డైలాగ్ మాడ్యులేషన్ కోసం నేటికీ అదుర్స్ ని యూట్యూబ్ లో చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.

ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 'మాడ్ స్క్వేర్'(Mad Square)మూవీ సక్సెస్ మీట్ నిన్న హైదరాబాద్(Hyderabad)లో ఘనంగా జరిగింది.ఈ వేడుకకి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరయ్యాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నవ్వించడం చాలా గొప్ప వరం.ఎవరైనా ఒకరొచ్చి మనల్ని నవ్విస్తే బాగుండు కదా మన కష్టాలు,బాధల్ని నుంచి బయటపడతాం అని అనిపిస్తుంటుంది.కాకపోతే అలాంటి మనుషులు మనకి అరుదుగా దొరుకుతారు.అలా అరుదుగా దొరికిన వ్యక్తి కళ్యాణ్ శంకర్.ఏ నటుడికైనా కామెడి ని పలికించడం చాలా కష్టమైన పని.అందుకే నేను అదుర్స్ 2 చెయ్యడం లేదు.ఇప్పుడు అంతగా కామెడి ని పండించగలనా లేదా అని భయపడుతున్నాను.

కాకపోతే దేవర పార్ట్ 2 మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.దాని కంటే ముందు ప్రశాంత్ నీల్(Prashant Neel)సినిమా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ ఫస్ట్ టైం వార్ 2 తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండటంతో ఆ మూవీపై అభిమానులతో పాటు భారీ అంచనాలు ఉన్నాయి.అగస్ట్ 14 న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న వార్ 2(War 2)లో హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.