English | Telugu

యన్ టి ఆర్ "దమ్ము" ఎంతవరకొచ్చింది...!

యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, త్రిష, కార్తీక హీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో, క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యువ నిర్మాత అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "దమ్ము". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.యస్.రామారావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం యూనిట్ ఇటీవల కేరళలోని పొల్లాచ్చికి వెళ్ళింది. అక్కడి నుండి రాగానే మైసూర్ స్కెడ్యూల్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల మైసూర్ స్కెడ్యూల్ ఆలస్యమయ్యింది.

ఈ చిత్రంలో యన్ టి ఆర్ కి తల్లిగా సీనియర్ హీరోయిన్ భానుప్రియ నటిస్తున్నారు. బోయపాటి శీని "సింహా" చిత్రం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం "దమ్ము". బోయపాటి శీను బాబాయ్ బాలకృష్ణకి "సింహా" ఎంత పెద్ద హిట్టిచ్చాడో అబ్బాయ్ యన్ టి ఆర్ కి "దమ్ము" రూపంలో అంతకంటే పెద్ద హిట్టివ్వనున్నాడని వారి అభిమానులు భావిస్తున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.