English | Telugu

ఫ్యాన్స్ కి పండగే.. 'ఎన్టీఆర్ 31' అప్డేట్ వచ్చేసింది!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. వరుస అప్డేట్స్, సెలబ్రేషన్స్ తో వాళ్ళు గాలిలో తేలిపోతున్నారు. ఎన్టీఆర్ 30వ సినిమా 'దేవర' ఫస్ట్ లుక్ నిన్న(మే 19) సాయంత్రం విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈరోజు 'సింహాద్రి' రీరిలీజ్ తో థియేటర్ల వద్ద అభిమానులు తెగ హంగామా చేస్తున్నారు. అలాగే 'వార్-2'తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా హృతిక్ రోషన్ క్లారిటీ ఇచ్చేశాడు. వీటితో పాటు తాజాగా 'ఎన్టీఆర్ 31' అప్డేట్ కూడా వచ్చేసింది.

ఎన్టీఆర్ తన 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. గతేడాది ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని వదలగా.. కేవలం ఒక్క పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ని ఈరోజు మేకర్స్ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి నుంచి షూటింగ్ మొదలు కానుందని ప్రకటించారు.

ఎన్టీఆర్ ఈ ఏడాది చివరి కల్లా 'దేవర' షూటింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత 'వార్-2' షూటింగ్ తో బిజీ అయ్యే అవకాశముంది. 'వార్-2' కోసం కేవలం రెండు-మూడు నెలలు మాత్రమే కేటాయించి.. అది పూర్తి కాగానే తన పూర్తి దృష్టిని 'ఎన్టీఆర్ 31' పైనే పెట్టనున్నాడని అంటున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.