English | Telugu

'ఎన్టీఆర్ 30' మూవీ లాంచ్ వాయిదా!

'ఎన్టీఆర్ 30' మూవీ లాంచ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవరి 24న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభించి, మార్చి మూడో వారంలో షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో 'ఎన్టీఆర్ 30' మూవీ లాంచ్ ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

'ఆర్ఆర్ఆర్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సినీ ప్రముఖుల సమక్షంలో ఫిబ్రవరి 24న ఘనంగా ప్రారంభించాలి అనుకున్నారు. అయితే తారకరత్న మృతి చెందటంతో మూవీ లాంచ్ కొద్దిరోజులు వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. లాంచ్ వాయిదా పడినప్పటికీ షూటింగ్ మాత్రం ఆలస్యం కాదని.. మార్చిలో రెండో వారంలో మూవీని లాంచ్ చేసి, మూడో వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారని వినికిడి. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ పేర్లు ఖరారయ్యాయి. లాంచ్ సమయంలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

మరోవైపు నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సైతం వాయిదా పడినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తన 108వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కొత్త షెడ్యూల్ ఈ వారంలోనే మొదలు కావాల్సి ఉంది. కానీ తారకరత్న మృతితో కొద్దిరోజులు పాటు షూటింగ్ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.