English | Telugu

షాకింగ్ రెమ్యూనరేషన్!

టాలీవుడ్ లో కొత్తదనంతో కూడిన కథలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు యంగ్ హీరో నిఖిల్.హ్యాపీడేస్ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నారు. యువత, స్వామి రారా, కార్తికేయ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అర్జున్ సుర‌వ‌రం తో స్పెషల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరిపోయారు.

కృష్ణ తత్వంతో తెరకెక్కిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కూడా బాగా నచ్చేసింది. ఈ సక్సెస్ తో నేషన‌ల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. కార్తికేయ 1ఆల్రెడీ సూపర్ హిట్ కాగా ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ2 మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ గా నిలిచింది. ఆయన కెరీర్ లోనే 100కోట్ల సినిమాగా నిలిచింది. ఆ ఉత్సాహంతోనే రీసెంట్‌గా 18 పేజెస్ అనే ఫీల్ గుడ్ హిట్టును అందుకున్నారు. అది కూడా ఆకట్టుకుంది.

తదుపరి సినిమాల కథల విషయంలో బాగా ఫోకస్ పెట్టారు. మిగతా హీరోలు రొటీన్ మాస్ మసాలా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ఓటేస్తుంటే ఆయన మాత్రం భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటున్నారు. మరోవైపు భారీ సక్సెస్ అందుకోవడంతో ఆయనతో పని చేసేందుకు దర్శక నిర్మాతలు భారీ సంస్థలు కూడా ఆసక్తి చెబుతున్నాయి. మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన త‌న రెమ్యూన‌రేష‌న్ ని కూడా బాగా పెంచేశారట. ఆయన మార్కెట్ కూడా పెరగడంతో నిఖిల్ అడిగినంత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారట.

దీంతో తన తొలి సినిమాకు 25 వేల పారితోషకం తీసుకున్న నిఖిల్ ఇప్పుడు ఒక్కో సినిమాకు 12 నుంచి 14 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిఖిల్‌తో సినిమా చేసేందుకు సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే త్వ‌ర‌లో నిఖిల్ స్పై చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎడిటర్ గ్యారీ బిహెచ్ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్య మేనన్న కథానాయక.ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.