English | Telugu

రామ్ చరణ్ డ్యాన్స్ చూసి షాకైన శంకర్!

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ లో ఉన్న బెస్ట్ డ్యాన్సర్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఆయన సినిమా వస్తుందంటే అందులో అదిరిపోయే స్టెప్పులు ఉండటం కామన్. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'RC 15' కోసం చరణ్ తన డ్యాన్స్ డోస్ ని మరింత పెంచబోతున్నాడట.

శంకర్ సినిమాలలో పాటలకు ప్రత్యేక స్థానముంటుంది. ఆయన ప్రతి పాటని భారీస్థాయిలో రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇప్పుడు 'RC 15' విషయంలోనూ అదే చేయబోతున్నారు. ఇందులో పాటల కోసమే ఏకంగా రూ.40 కోట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం జానీ, ప్రేమ్ రక్షిత్, ప్రభుదేవా, గణేష్ ఆచార్య, బాస్కో మార్టిస్ ఇలా బడా కొరియోగ్రాఫర్స్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

అసలే శంకర్ సాంగ్స్ తెరకెక్కించడంలో దిట్ట. దానికితోడు చరణ్ లాంటి మంచి డ్యాన్సర్ దొరికాడు. అందుకే శంకర్ 'RC 15'లో సాంగ్స్ పై మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుండగా, తాజాగా జరిగిన సాంగ్ షూట్ లో చరణ్ తన డ్యాన్స్ తో డైరెక్టర్ శంకర్ ని ఆశ్చర్యపరిచాడట. సింగల్ టేక్ లో 80 సెకన్ల నిడివి గల స్టెప్ వేసి చరణ్ ఆకట్టుకున్నాడట. చరణ్ డ్యాన్స్ స్కిల్స్ చూసి శంకర్ తో పాటు మూవీ టీమ్ అంతా ఫిదా అయ్యారట.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.