English | Telugu

వరుణ్ నిశ్చితార్థానికి ముందే నిహారిక విడాకులు!

మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు కొద్ది నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ లో చైతన్య కనిపించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వరుణ్ నిశ్చితార్థానికి ముందే నిహారిక తన భర్త నుంచి విడిపోయినట్లు తాజాగా క్లారిటీ వచ్చేసింది.

2020 డిసెంబర్ లో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది. పెళ్ళయిన మొదటి ఏడాదిన్నర, రెండేళ్ళు వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆ తరువాత ఏవో కారణాల వల్ల వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరు విడిపోతున్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. జూన్ 9న జరిగిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థంలో నిహారిక భర్త చైతన్య కనిపించకపోవడంతో విడాకులపై దాదాపు అందరికి క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా వీరి విడాకుల పిటిషన్, కోర్టు ఆర్డర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏప్రిల్/మే సమయంలో నిహారిక-చైతన్య పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 5 న వీరి విడాకులు మంజూరు అయ్యాయి. అంటే వరుణ్ నిశ్చితార్థానికి ముందే నిహారిక, చైతన్య విడిపోయారన్నమాట.

తాజాగా నిహారిక కూడా సోషల్ మీడియా వేదికగా తన విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చైతన్య, తాను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని.. తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె ప్రెస్ నోట్ విడుదల చేసింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.