English | Telugu

నిన్న రామ్‌చరణ్‌, నేడు ఎన్టీఆర్‌.. నెట్‌ఫ్లిక్స్‌ టార్గెట్‌ ఏమిటి?

నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ టెడ్‌ సరాండోస్‌ డిసెంబర్‌ 7న మెగాస్టార్‌ ఫ్యామిలీని కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి నివాసానికి వెళ్లి అక్కడ చిరుతోపాటు రామ్‌చరణ్‌, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌లను కలిసి వారితో కాసేపు గడిపారు. డిసెంబర్‌ 8 మధ్యాహ్నం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ను అతని నివాసంలోనే కలిశారు టెడ్‌ సరాండోస్‌. నెట్‌ఫ్లిక్స్‌ సీఈవో.. ఎన్టీఆర్‌ని కలిసిన సమయంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కొరటాల శివ ఉన్నారు. ఎన్టీఆర్‌, టెడ్‌ ఇద్దరూ సినిమాలకు సంబంధించిన అనేక విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత టెడ్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులతో కలిసి ఎన్టీఆర్‌ బృందం లంచ్‌ చేశారు

అనంతరం ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘టెడ్‌ని కలవడం, వారి టీమ్‌తో కలిసి లంచ్‌ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది’ అన్నారు. టెడ్‌ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌తో గడిపిన ఈ క్షణాలు మరచిపోలేనివి. మా ఇద్దరి మధ్య సినిమాల గురించి, ఇతర విషయాల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది’ అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.