English | Telugu

'జైలర్' దర్శకుడితో అల్లు అర్జున్.. అట్లీ సినిమా అటకెక్కింది!

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప: ది రూల్' మూవీ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆ తర్వాత డైరెక్టర్స్ త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు కమిటై ఉన్నాడు. 'పుష్ప-2' వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుండగా, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. సందీప్ రెడ్డి సినిమా మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ లో మరో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు బన్నీ. అయితే రీసెంట్ గా 'జవాన్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా దాదాపు ఖరారైందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు సడెన్ గా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది.

తక్కువ సినిమాలతోనే తమిళ్ లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నెల్సన్. ముఖ్యంగా ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, నెల్సన్ చెప్పిన కథ బన్నీకి నచ్చిందని వినికిడి. అన్నీ కుదిరితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తో పాటు నెల్సన్ ప్రాజెక్ట్ కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని సమాచారం. మొత్తానికి నెల్సన్ ఎంట్రీతో ప్రస్తుతానికి బన్నీ-అట్లీ కాంబినేషన్ లో సినిమా లేనట్టేనని అంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.