English | Telugu

ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ లో నేహా చౌదరి!


ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఫుల్ హుషారెత్తిస్తోంది. ఈ మూవీ కొంచెం కన్ఫ్యూషన్ గా ఉన్నా ఓవరాల్ గా కామెడీగా చాల బాగుంది అనే టాక్ ని సొంతం చేసుకుంది. ఐతే ఈ మూవీలో ఫస్ట్ టైం చిన్న రోల్ చేసింది నేహా చౌదరి. ఇక ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది..తన ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. "డేంజర్ పిల్లా ఇక్కడ ఉంది!!!! సినిమాలో నేను చేసినది చాలా చిన్న పాత్ర!!!


ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద కనిపించాను !!! ఈ అవకాశం ఇచ్చిన అలాగే మరపురాని జ్ఞాపకాలను అందించినందుకు ధన్యవాదాలు ..ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అంటూ ఒక టాగ్ పెట్టుకుంది. ఐతే ఈ మూవీలో నటించిన రాజశేఖర్ ఐజీ విజయ్ చక్రవర్తిగా నటించారు. ఆయన టీమ్ లో ఒక సభ్యురాలిగా నేహా కనిపించింది. ఇక ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే గెటప్ లో ఒక వీడియో చేసి పోస్ట్ చేసింది. ఈమధ్య బుల్లితెర మీద వాళ్లంతా సిల్వర్ స్క్రీన్ మీద తళుక్కున చిట్టి చిట్టి క్యారెక్టర్స్ లో మెరిసిపోతూ ఫుల్ ఫేమస్ అవుతున్నారు.

నిన్న గాక మొన్న "జవాన్" మూవీలో మన బుల్లితెర నటి సిరి హన్మంత్ చిన్న పోలీస్ రోల్ లో కనిపించింది ఇప్పుడు అలాంటి ఒక రోల్ లో నేహా కూడా కనిపించింది. ఇంతకు ఈ మూవీ మధ్యలో వచ్చే ఐజీ విజయ్ చక్రవర్తి (రాజశేఖర్) పాత్ర ఏమిటి ? ఆయన టీమ్ లో నేహా రోల్ ఏమిటి అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక నేహా కూడా వాళ్ళ పేరెంట్స్ ని తీసుకెళ్లి ఆ మూవీని చూసి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అంటూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. అందరూ పగలబడి నవ్వుకున్నారని కూడా చెప్పింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.