English | Telugu

సలార్ రెండు వారాలే అంటున్న ఆ హీరో ఫ్యాన్స్..సోషల్ మీడియాలో ప్రకంపనలు

ఇప్ప్పుడు ఇండియా మొత్తం సలార్ మానియా ప్రారంభం అయ్యింది. రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ ల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రేక్షకులు కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపడంకోసం సలార్ ఇంకో వంద రోజుల్లో రాబోతుందనే పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా సోషల్ మీడియాలో సలార్ గురించి వస్తున్న ఒక న్యూస్ సంచలనం సృష్టిస్తుంది.

సలార్ ఇంక కేవలం రెండు వారాల్లో మన ముందుకు రాబోతుందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రకరకాలుగా పోస్ట్ లు పెడుతూ ప్రభాస్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.ట్రైలర్ తో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయని అలాగే ట్రైలర్ రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకెళ్తుందని రేపు విడుదలయ్యే సాంగ్ తో ఇక జనం థియేటర్ల దగ్గరికి అడ్వాన్సు బుకింగ్ కోసం పరుగులు తీస్తారని అంటున్నారు. అలాగే ఆన్ లైన్ బుకింగ్ కూడా నిము షాల వ్యవధిలోనే క్లోజ్ అయిపోతుందని కూడా అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నామని కూడా అంటున్నారు.

కేజిఎఫ్ సిరీస్ తో ఇండియన్ సినిమాకి ఒక కొత్త రకం మార్కుని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తే బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కే ఒక కొత్త రకం మార్క్ ని ప్రభాస్ క్రియేట్ చేసాడు. ఇప్పుడు వీళ్ళద్దిరి కాంబోలో వస్తున్న సలార్ ఇండియన్ సినిమా కి సరికొత్త సవాలు విసరటం ఖాయమని సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సలార్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడనే మాటలు వినపడుతున్నాయి. కానీ మేకర్స్ ఆ విషయాన్నీ ఎక్కడ అధికారకంగా ప్రకటించటలేదు. రేపు సినిమా విడుదలయ్యాక గాని అసలు నిజం తెలియదు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.