English | Telugu

నరేష్‌ రెండో భార్య చేసిన ఆరోపణలపై స్పందించిన నరేష్‌ తనయుడు నవీన్‌!

సీనియర్‌ నరేష్‌ తనయుడు నవీన్‌ హీరోగా కొన్ని సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. సీనియర్‌ నటి పవిత్ర లోకేష్‌ను నరేష్‌ నాలుగో పెళ్ళి చేసుకోవడం పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. నరేష్‌, పవిత్ర ఉన్న హోటల్‌కి వెళ్ళి ఆయన రెండో భార్య చేసిన హడావిడి అందరికీ తెలిసిందే. కృష్ణ చనిపోయినప్పుడు రమ్య రఘుపతి ఓ వీడియో విడుదల చేసింది. అందులో రమ్య చేసిన ఆరోపణలపై నవీన్‌ క్లారిటీ ఇచ్చారు. కృష్ణ మృతదేహాన్ని అనాథగా వదిలేశారని ఆమె చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, మేమంతా ఉన్నాం కదా అని చెప్పారు. విజయనిర్మలగారితో తనకు ఎంతో అనుబంధం వుందని, ఆమె మరణించిన తర్వాత ఆ బాధ నుంచి బయట పడడానికి సంవత్సరం పట్టిందని అన్నారు. అలాంటిది 40 సంవత్సరాల పాటు కృష్ణగారు, విజయనిర్మలగారు కలిసి ఉన్నారని, ఆ జ్ఞాపకాల నుంచి ఆయన బయటపడలేకపోయారని, ఎంతో కృంగిపోయారని చెప్పారు. మేం ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళాలని ఎంతో ప్రయత్నించాం. కానీ, విజయనిర్మలగారి జ్ఞాపకాల వల్ల, ఆ ఇంటితో తనకున్న అనుబంధం వల్ల వదిలి రాలేకపోయారని అన్నారు. తమ ఫ్యామిలీ అందరికీ అటాచ్‌ మెంట్స్‌ ఎక్కువని, విజయనిర్మలగారు పోయాక కూడా అందరం మీట్‌ అయ్యే వాళ్లమని, కృష్ణ గారు కూడా పోయాకా... మహేశ్‌ బాబు ఇప్పటికీ మాట్లాడుకుంటామన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.