English | Telugu

సరిపోదా శనివారం.. నాని ఉగ్రరూపం

నేచురల్ స్టార్ నాని తన 30వ సినిమా 'హాయ్ నాన్న'ని శౌర్యువ్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత తన 31వ సినిమాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో చేస్తున్నాడు నాని. 'అంటే సుందరానికీ' తర్వాత వీరి కలయికలో వస్తున్న చిత్రమిది. దసరా కానుకగా తాజాగా ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు, గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్.

డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సరిపోదా శనివారం' అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టారు. గ్లింప్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. సాయి కుమార్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ని రూపొందించారు. "ప్రతి మనిషికి ఒకరోజు వస్తుంది. అలాంటి రోజు ఒకడికి వారానికి ఒకసారి వస్తే.. వాడిని ఎవరైనా ఆపాలి అనుకోగలరా? అనుకున్నా ఆపగలరా?. శనివారం.. ప్రతి శనివారం.. సరిపోదు అంటారా?.." అనే వాయిస్ తో గ్లింప్స్ నడిచింది. ఇనుప గొలుసులతో బంధించబడిన నాని, వాటిని తెచ్చుకొని నిలబడటం ఆకట్టుకుంది. వాయిస్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో 'సరిపోదా శనివారం' గ్లింప్స్ పవర్ ఫుల్ గా ఉంది.

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తున్నాడు. జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.