English | Telugu

లావ‌ణ్య బ్యాచిల‌ర్ పార్టీ.. ఫొటోలు వైర‌ల్

టాలీవుడ్ హీరో వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిని ఆయ‌న వివాహం చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. అది కూడా డెస్టినేష‌న్ వెడ్డింగ్. ఇట‌లీలోని టుస్కానీ విలేజ్‌లో న‌వంబ‌ర్ 1న‌ ఈ ల‌వ్ బ‌ర్డ్స్ ఒక్క‌టి కానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాటు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే వ‌రుణ్ తేజ్ అన్న‌య్య‌, హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఇటలీలో చేరుకున్నారు. కాబోయే వ‌రుడు వ‌రుణ్ తేజ్ కూడా ఇట‌లీ చేరుకున్నారు. డెస్టినేష‌న్ వెడ్డింగ్ కాబ‌ట్టి ప‌రిమిత సంఖ్య‌లో కుటుంబ స‌భ్యులు, మిత్రులు, స‌న్నిహితులు మాత్ర‌మే ఈ వివాహానికి హాజ‌రు కాబోతున్నారు.

వివాహం త‌ర్వాత హైద‌రాబాద్‌లో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు మెగా ఫ్యామిలీ గ్రాండ్ రిసెప్ష‌న్‌ను కూడా ప్లాన్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా చాలా ప‌రిమితంగానే ఈ పెళ్లికి హాజ‌రు కాబోతున్న‌ట్లు స‌మాచారం. తాజాగా కాబోయే మెగా కోడలు ఇచ్చిన బ్యాచిల‌ర్ పార్టీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ పార్టీలో నితిన్ స‌తీమ‌ణి షాలిని, రీతూవ‌ర్మ‌, నిహారిక‌, నీర‌జ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఉపాస‌న టస్కానీకి సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాలో షేర్ చేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.