English | Telugu

పవన్ కళ్యాణ్ కి ఫ్లైట్ ఇచ్చిన నాగార్జున 

అక్కినేని అండ్ మెగా కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ నాటిది కాదు. మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి ఆ రెండు కుటుంబాల మధ్య ఎంతో అనుబంధం కొనసాగుతు ఉంది.మెగాస్టార్ , ఏయన్ఆర్ ని గురువు గారు అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అలాగే చిరంజీవి ఫారెన్ వెళ్ళినప్పుడల్లా నాగేశ్వరరావు గారికి గిఫ్ట్ లని కూడా తీసుకొచ్చి ఇస్తుంటారు. ఇదే అనుబంధాన్ని కంటిన్యూ చేస్తు చిరంజీవి నాగార్జునలు కూడా చాలా సోదర భావంతో మెలుగుతు ఉంటారు. ఒకరంటే ఒకరికి చాలా అభిమానం. కానీ ఆ బంధం చిరు నాగ్ ల వరకే కాదు అని నిరూపితమైన ఒక సంఘటన మెగా అక్కినేని కుటుంబాలకి చెందిన ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని తీసుకొస్తుంది.

పవన్ కళ్యాణ్ తాజాగా వైజాగ్ లో ఉన్న మత్యకారుల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్లాడనే విషయం అందరికి తెలిసిందే. పవన్ అక్కడికి వెళ్లే ముందు కొన్ని అనివార్య కారణాల వలన పవన్ వెళ్ళాలసిన ఫ్లైట్ మిస్ అయ్యింది. దాంతో పవన్ కళ్యాణ్ నాగార్జున కి ఫోన్ చేసి పరిస్థితి వివరించగానే నాగ్ తన ప్రత్యేక ఫ్లైట్ ని పవన్ కళ్యాణ్ కి పంపించాడు. నాగ్ కి చెందిన ఆ ఫ్లైట్ లోనే పవన్ వైజాగ్ వెళ్ళాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ఇన్నాళ్లు నాగార్జునకి ,చిరంజీవి కి మధ్యనే చాలా సాన్నిహిత్యం ఉందని అందరు భావించేవారు. ఎప్పుడు కూడా పవన్ కి నాగార్జున కి మధ్య అంత బాండింగ్ ఉందని ఎవరికీ తెలియదు. ఇదంతా ఎందుకు చెప్పవలిసి వస్తుందంటే నాగార్జున తన ప్రత్యేక ఫ్లైట్ ని బయట వ్యక్తులకి ఇవ్వడు.కేవలం తను,నాగ చైతన్య,అఖిల్ మాత్రమే దాన్ని వాడతారు. అలాంటిది పవన్ అడగ్గానే నాగ్ ఫ్లైట్ ని పంపించాడంటే వాళ్ళిద్దరి మధ్య బయట ప్రపంచానికి తెలియని అన్యోన్యత ఉందని అందరు అనుకుంటున్నారు.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.