English | Telugu

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ఈ ఓటీటీలో చూడొచ్చు..!

స్వల్ప విరామం అనంతరం లేడీ సూపర్ స్టార్ అనుష్కా శెట్టి నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్పొలిశెట్టి'. 'జాతిరత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ తరువాత నవీన్ పొలిశెట్టి ఇందులో హీరోగా నటించాడు. 'రా రా కృష్ణయ్య' ఫేమ్ పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. రథన్ బాణీలు, గోపీసుందర్ నేపథ్య సంగీతం అందించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' .. గురువారం (సెప్టెంబర్ 7) థియేటర్స్ లోకి వచ్చింది. ఓవరాల్ గా.. పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే, 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఏ ఓటీటీ వేదికలో స్ట్రీమ్ కాబోతుందో సినిమా టైటిల్స్ లో క్లారిటీ ఇచ్చేశారు. దిగ్గజ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ద్వారా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి స్ట్రీమ్ కానుంది. బహుశా వచ్చే నెలలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఎంటర్టైన్ చేసే అవకాశముంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వస్తుంది. ఏదేమైనా.. థియేటర్స్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ని మిస్ అయిన వాళ్ళు నెట్ ఫ్లిక్స్ లో చూసి తరించవచ్చన్నమాట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.