English | Telugu

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పండగే.. ఎందుకంటే?

- మానవీయ విలువలకు పట్టం కట్టిన ‘ఇడ్లీ కొట్టు’
- సూపర్‌ హీరోయిన్‌ విన్యాసాలతో ‘లోక చాప్టర్‌1’
- ప్రేక్షకుల్ని ఆధ్యాత్మికత వైపు నడిపించిన ‘కాంతారా చాప్టర్‌1’


ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సాధనాలలో సినిమా ప్రధానంగా నిలుస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రతి శుక్రవారం థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చేవి. ఆరోజుల్లో సినిమా చూడాలంటే థియేటర్‌ తప్ప మరో వేదిక లేదు కాబట్టి థియేటర్లనే ఆశ్రయించేవారు.


కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. రకరకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఎవరికి నచ్చిన సినిమాను వారు చూడగలుగుతున్నారు. కొందరు థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. మరికొందరు అదే సినిమా కోసం ఓటీటీలో వచ్చే వరకు వెయిట్‌ చేస్తారు. ఇటీవలి కాలంలో థియేటర్లకు గట్టి పోటీనిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసుకు రావడంలో ఓటీటీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Also Read:నిర్మాతలకు దెబ్బ మీద దెబ్బ.. ఓటీటీల కొత్త నిర్వాకం!


ఎంత పెద్ద సినిమా అయినా ఏదో ఒక ఓటీటీ సంస్థ ద్వారా స్ట్రీమింగ్‌ కావాల్సిందే. దాంతో సినిమా రిలీజ్‌ అయిన నెలరోజుల గ్యాప్‌లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అలా ఈవారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ప్రేక్షకులకు వినోదాల విందు చేయబోతున్నాయి. ఆ సినిమాల వివరాలేమిటో ఒకసారి చూద్దాం.


తను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకునే హీరోల్లో ధనుష్‌ ఒకరు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించేందుకు ఇటీవల ‘ఇడ్లీకొట్టు’ చిత్రంతో థియేటర్లలోకి వచ్చాడు ధనుష్‌. జీవితంలో మనం ఏ పని చేసినా కేవలం ఆదాయం కోసం కాకుండా ఆస్వాదిస్తూ చెయ్యాలి అనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. స్వీయ దర్శకత్వంలో ధనుష్‌ నటించిన ఈ సినిమా తమిళ్‌లో రూపొందింది. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్‌ అయింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్‌ 29 నుంచి స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో మానవీయ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

Also Read:ఈ సినిమాను థియేటర్‌లో చూసిన ప్రేక్షకులకు ఏమైందో తెలుసా?


ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లి చక్కని అనుభూతిని కలిగించిన మరో సినిమా ‘లోక చాప్టర్‌ 1’. మలయాళంలో రూపొందిన ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్‌ సూపర్‌ పవర్స్‌ ఉన్న చంద్ర పాత్రలో నటించి ప్రేక్షకుల్ని అలరించింది. డొమినిక్‌ అరుణ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ నిర్మించిన ఈ సినిమా తెలుగులో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మలయాళంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ లేడీ ఓరియంటెండ్‌ మూవీ అక్టోబర్‌ 31 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది.

Also Read:ట్రైలర్‌తో అల్లాడించిన రవితేజ.. ‘మాస్‌ జాతర’కు మాస్‌ మహారాజ్‌ రెడీ!


ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన సినిమా ‘కాంతార చాప్టర్‌1’. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ప్రేక్షకుల్ని ఆధ్యాత్మికత వైపు నడిపించింది. ఈ సినిమాలో రిషబ్‌ పెర్‌ఫార్మెన్స్‌, సంగీతం ప్రేక్షకులు మైమరచిపోయి సినిమా చూసేలా చేశాయి. ఈ సినిమా అక్టోబర్‌ 31న అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవనుంది. ఇలా.. థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందిన ఈ మూడు సినిమాలు ఇప్పుడు ఇంటిలోకి వచ్చేశాయి. ఇంటిల్లి పాదీ ఈ సినిమాలను చూసి ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.