English | Telugu
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' రివ్యూ ఇచ్చిన మెగాస్టార్!
Updated : Sep 5, 2023
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా మహేష్ బాబు.పి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే మెగాస్టార్ చిరంజీవి చూసేశారు. చూడటమే కాదు.. మూవీ టీంని ప్రత్యేకంగా పిలిచి అభినందించడమే కాకుండా.. సినిమాకి తనదైన శైలిలో రివ్యూ కూడా ఇచ్చారు.
"మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి చూశాను. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి 'దేవసేన', అనుష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు.
ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేష్ బాబుని అభినందించాల్సిందే.
BTW ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు" అంటూ ట్విట్టర్ వేదికగా టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.