English | Telugu

నాలుగో రోజు చేతులెత్తేసిన 'ఖుషి'.. పది కోట్ల నష్టం తప్పదా!

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఖుషి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలైంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లతో సత్తా చాటింది. అయితే నాలుగో రోజైన సోమవారం నాడు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మూడో రోజుతో పోలిస్తే నాలుగో రోజు కలెక్షన్స్ లో 75 శాతం డ్రాప్ కనిపించింది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.9.87 కోట్ల షేర్, రెండో రోజు రూ.5.36 కోట్ల షేర్, మూడో రోజు రూ.5.68 కోట్ల షేర్ రాబట్టిన ఖుషి.. నాలుగో రోజు రూ.1.05 కోట్ల షేర్ కే పరిమితమైంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి నాలుగో రోజుల్లో రూ.21.96 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే నాలుగు రోజుల్లో నైజాంలో రూ.11.86 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.2.09 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.8.01 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.5.10 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.7.80 కోట్ల షేర్ కలిపి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.34.86 కోట్ల షేర్ వసూలు చేసింది.

వరల్డ్ వైడ్ గా రూ.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఖుషి మూవీ.. మొదటి రోజు రూ.15.37 కోట్ల షేర్, రెండో రోజు రూ.8.46 కోట్ల షేర్, మూడో రోజు రూ.8.73 కోట్ల షేర్, నాలుగో రోజు రూ. 2.33 కోట్ల షేర్ తో.. నాలుగు రోజుల్లో రూ.34.86 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.18 కోట్లకి పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ నాలుగో రోజైన సోమవారం కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయ్యాయి. దానికి తోడు గురువారం(సెప్టెంబర్ 7న) 'జవాన్', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలు విడుదలవుతున్నాయి. అంటే ఈ రెండు రోజుల్లో(మంగళ, బుధ వారాల్లో) ఖుషి జోరు చూపించాల్సి ఉంది. లేదంటే హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఈ సినిమా నష్టాలను చూసే అవకాశముంది.

'ఖుషి' 4 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ.11.86 కోట్ల షేర్
సీడెడ్ : రూ.2.09 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.8.01 కోట్ల షేర్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.21.96 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ.5.10 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.7.80 కోట్ల షేర్

ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల కలెక్షన్స్ : రూ.34.86 కోట్ల షేర్

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.