English | Telugu

2024లో ధ‌నుష్ తేరే ఇష్క్ మే!

రాంజానా సినిమా గుర్తుందిగా. స‌రిగ్గా ద‌శాబ్దం క్రితం ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైంది. 2013 జూన్ 21న ధ‌నుష్‌ని బాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేసింది. ధ‌నుష్, సోన‌మ్ క‌పూర్ న‌టించిన ఆ మూవీకి ఇప్ప‌టికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాతో స్టార్ట్ అయిన ధ‌నుష్‌, ఆనంద్ ప‌రిచ‌యం 2021లో అత్రంగి రే లోనూ కంటిన్యూ అయింది. ఇప్పుడు మ‌ళ్లీ ఈ హిట్ కాంబో సిల్వ‌ర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయ‌డానికి రెడీ అయింది.

వ‌చ్చే ఏడాది స్టార్టింగ్‌లో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్తుంది. ఈ విష‌యాన్ని ఆనంద్ ఎల్ రాయ్ ప్ర‌క‌టించారు. తేరే ఇష్క్ మే అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ధ‌నుష్ చేతిలో మండుతున్న బాటిల్ ప‌ట్టుకుని ప‌రిగెత్తుకుంటూ వెళ్లి విసిరేస్తారు. అక్క‌డ రాంజానా వ‌ర‌ల్డ్ నుంచి వ‌స్తున్న తేరే ఇష్క్ మే అనే టైటిల్ రివీల్ అయింది. వీడియో చూసిన వారంద‌రూ చాలాబాగా చేశార‌ని మెచ్చుకుంటున్నారు.

కొన్ని బంధాలు ఎప్ప‌టికీ పాత‌బ‌డ‌వు అని హింట్ ఇస్తూ, తేరే ఇష్క్ మే ప్రాజెక్ట్ గురించి ఎగ్జ‌యిట్ అయ్యారు డైర‌క్ట‌ర్ ఆనంద్‌. ``మా నెక్స్ట్ వెంచ‌ర్‌ని అనౌన్స్ చేయ‌డానికి ఇంత‌క‌న్నా మంచి త‌రుణం ఎక్క‌డ ఉంటుంది? ధ‌నుష్‌, రాంజానా నా గుండెలో ఎప్ప‌టికీ బెస్ట్ ప్లేస్ క‌లిగి ఉన్న అంశాలు. రాంజానాతో ధ‌నుష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. త‌న‌కున్న టాలెంట్‌తో మాసివ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. హిందీ, సౌత్ స‌రిహ‌ద్దులు చెరిగిపోతున్న వేళ మేం ప్యాన్ ఇండియా సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాం`` అని అనౌన్స్ చేశారు. రా ఎమోష‌న్స్, మెలోడియ‌స్ మ్యూజిక్‌, బెస్ట్ స్టోరీతో ఈ సినిమా ఉంటుంద‌ని హింట్ ఇస్తోంది యూనిట్‌. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. 2024లో విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ మూవీలోనూ ధ‌నుష్ పెరిగిన గ‌డ్డం, జుట్టుతో మాస్‌గా క‌నిపిస్తున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.