English | Telugu

ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడెందుకు.. నాగబాబుని మళ్లీ కెలికిన విష్ణు!

మంచు విష్ణు గతకొంతకాలంగా ట్రోలింగ్ ని ఎదుర్కొంటున్నాడు.. ఒకానొక టైం లో ట్రోలింగ్ తో విసిగిపోయిన మంచు ఫ్యామిలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసింది.. అంతా సర్దుమణిగిందిలే అనుకుంటున్నా టైం లో మంచు విష్ణు లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడు ఎందుకు అని మాట్లాడాడు. అది నాగబాబు గురించే అని టాలీవుడ్ లో చర్చమొదలైనది.

నాగబాబు అంటే పడని వాళ్ళు , రాజకీయం గా వై సి పి వాళ్ళు , ఒకానొక సందర్భం లో శ్రీరెడ్డి , బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు బాలయ్య ఫాన్స్ అందరూ కూడా నాగబాబు ని సోషల్ మీడియా లో స్నేక్ బాబు అంటూ ట్రోల్ చేసారు.. ఐతే ఇప్పుడు విష్ట్ను కూడా అలానే అనటం తో మల్లి మొదలైనంది రచ్చ అంటున్నారు చూస్తున్నవాళ్ళు .!

ఐతే విష్టు తనని ఎవరు ట్రోల్ చేస్తున్నారో తనకు తెలుసనీ.. ఎప్పుడు ఐతే తాను మా ఎలక్షన్ లో పోటీకి దిగినప్పటినుండి తనమీద , తన కుటుంభం మీద కావాలని ట్రోల్స్ చేయించారని చెప్పేరు. అలానే ఈ రోజుల్లో ట్రోల్స్ కామన్.. ఎవరుకు జరగట్లేదు ట్రోల్స్.? తారక్, ప్రభాస్ , మహేష్ అందరు కూడా ట్రోలింగ్ కి గురిఅవుతున్నవాళ్ళే అంటూ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ తాజా కామెంట్స్ మీద మెగా శిబిరం ఎలా స్పందిస్తుందో.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.