English | Telugu

బీజేపీలోకి మంచు లక్ష్మి.. ఒకే ఫ్యామిలీలో ఇన్ని పార్టీలా!

ఎందరో సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే రాజకీయాల్లో సక్సెస్ అయిన సినిమావాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. ఇప్పుడు నటి మంచు లక్ష్మి సైతం పాలిటిక్స్ లో తన లక్ ని టెస్ట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మంచి లక్ష్మి బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. "ఢిల్లీ వైబ్స్" అంటూ తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.

మంచు ఫ్యామిలీ చాలాకాలం నుంచి ప్రధాని మోడీకి, బీజేపీకి దగ్గరగా ఉంటూ వస్తుంది. అయితే వాళ్ళు బీజేపీలో మాత్రం చేరలేదు. గతంలో టీడీపీకి మద్దతుగా నిలిచిన మోహన్ బాబు.. ఆయన పెద్ద కుమారుడు విష్ణు, వైఎస్ బంధువురాలిని పెళ్లి చేసుకోవడంతో.. వైఎస్ కుటుంబానికి దగ్గరై 2019 ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మోహన్ బాబు ఈమధ్య పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేనప్పటికీ, విష్ణు మాత్రం మా బావ అంటూ వైఎస్ జగన్ కి దగ్గరగా ఉంటున్నారు. ఇక మనోజ్ విషయానికొస్తే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ని ఇష్టపడతారు. కానీ ఆయన భార్య భూమా మౌనిక కుటుంబం మాత్రం టీడీపీలో కీలకంగా ఉంది. ఇక ఇప్పుడు లక్ష్మి బీజేపీలో చేరితే మంచు కుటుంబంలో పలు పార్టీల జెండాలు ఉన్నట్లు అవుతుంది. మరి లక్ష్మి నిజంగానే బీజేపీలో చేరతారా? చేరితే ఎన్నికల బరిలో నిలుస్తారా? నిలిస్తే తెలంగాణాలో పోటీ చేస్తారా లేక ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.