English | Telugu

అక్కడ రామ్, బెల్లంకొండ.. ఇక్కడ మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో రికార్డులు సృష్టించారు. తాజాగా ఆయన ఖాతాలో సరికొత్త రికార్డు వచ్చి చేరింది. మహేష్ నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'శ్రీమంతుడు' యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ సాధించింది.

మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కలయికలో వచ్చిన మొదటి సినిమా 'శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 2015, ఆగస్టు 7న విడుదలై అప్పట్లో నాన్-బాహుబలి హిట్ గా నిలిచింది. ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలోనే కాదు.. డిజిటల్ లోనూ రికార్డులు సృష్టిస్తోంది. యూట్యూబ్ లో ఈ సినిమా ఏకంగా 200 కి పైగా మిలియన్ వ్యూస్ సాధించింది. తెలుగు సినిమాల వ్యూస్ పరంగా యూట్యూబ్ లో ఇదొక సరికొత్త రికార్డుగా చెప్పవచ్చు.

అయితే హిందీలోకి డబ్ అయ్యి యూట్యూబ్ లో విడుదలైన తెలుగు సినిమాల్లో 200 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన కొన్ని సినిమాలు 500 మిలియన్లకి పైగా వ్యూస్ కూడా సాధించాయి. అయితే తెలుగు వెర్షన్ పరంగా మాత్రం 200 మిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సినిమాగా శ్రీమంతుడుదే రికార్డు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.