English | Telugu

బాహుబ‌లిని కాపీ కొడుతున్న - శ్రీ‌మంతుడు?

తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పెంచిన చిత్రం బాహుబ‌లి. తొలి రోజే రూ.73 కోట్ల‌కు పైచిలుకు గ్రాస్ సాధించి ఆల్ ఇండియా రికార్డు సృష్టించింది. ఓ ప్రాంతీయ చిత్రం ఈ స్థాయిలో వ‌సూళ్ల సునామీ సృష్టించ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ సంచ‌ల‌నానికి ఈ సినిమాకొచ్చిన హైప్ ఓ కార‌ణ‌మైతే.. చిత్ర‌బృందం ఫాలో అయిన మార్కెట్ స్ట్రాట‌జీ మ‌రో కార‌ణం. ప‌బ్లిసిటీ విష‌యంలో బాహుబ‌లి టీమ్ కొత్త పంథా అనుస‌రించింది. ఒక్క పైసా కూడా ఖ‌ర్చుపెట్ట‌కుండా కోట్ల రూపాయ‌ల విలువైన ప‌బ్లిసిటీ చేసింది. ఈ ప్లాన్‌... ఇప్పుడు శ్రీ‌మంతుడు టీమ్‌కీ న‌చ్చింది. వాళ్లు కూడా సేమ్ ఇదే మార్కెట్ స్ట్రాట‌జీతో త‌మ సినిమాకి ఫ్రీ ప‌బ్లిసిటీ చేయించుకోవాల‌ని చూస్తోంది. సినిమా విడుద‌ల‌య్యేలోగా వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా.. శ్రీ‌మంతుడు పోస్ట‌ర్ల‌ను ఒకొక్క‌టిగా విడుద‌ల చేస్తూ.. ఈ సినిమాని ప‌బ్లిసిటీ చేద్దామ‌నుకొంటోంది టీమ్.

బాహుబ‌లి ఈ రేంజులో వ‌సూళ్లు సాధించ‌డానికి కార‌ణం.. అత్య‌ధిక థియేట‌ర్ల‌లో సినిమాని విడుద‌ల చేయ‌డ‌మే. ఏ థియేట‌ర్‌కి వెళ్లినా.. అక్క‌డ బాహుబ‌లి పోస్ట‌రే క‌నిపిస్తోంది. ఆసినిమానే ఆడుతోంది. అందుకే.. శ్రీ‌మంతుడు టీమ్ కూడా ఇదే ఫార్ములా అనుస‌రించాల‌ని చూస్తోంది. ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్ర్రాల్లో దాదాపుగా 1800 థియేట‌ర్లున్నాయి. అందులో 1600 థియేట‌ర్ల‌లో శ్రీ‌మంతుడుని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణయించుకొంది. విడుద‌ల‌కు ఒక్క‌రోజు ముందు.. ప్రీమియ‌ర్ షోల‌ను భారీ ఎత్తున ప్ర‌ద‌ర్శించాల‌ని చూస్తోంది.
ప్రీమియ‌ర్ షోల రూపంలో క‌నీసం రూ.4 నుంచి 8 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ వెన‌కేయాల‌ని చూస్తోంది. శ్రీ‌మంతుడు ఒక్క‌టే కాదు... ఇక నుంచి పెద్ద సినిమాల‌న్నీ ఈ ప్రీమియ‌ర్ షోల‌పై దృష్టి పెట్ట‌డం ఖాయం. మొత్తానికి రాబోయే పెద్ద సినిమాల‌కు బాహుబ‌లి ఓ పాఠంలా, దిక్చూచీలా మిగిలిపోయింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.