English | Telugu

ఆగడు ఆగుతుందా !!!


మూడు రోజుల్లో ఆగడు టీజర్ పది లక్షల హిట్స్ సాధించింది. ఇది మహేష్ కున్న క్రేజా, లేక టీజర్‌లో ఉన్న కాంట్రవర్సీ వలనా అనేది పక్కన పెడితే.. ఈ టీజర్ విడుదలైనప్పటి నుంచి ప్రిన్స్ అభిమానులు పవన్ అభిమానుల మధ్య కామెంట్ల వార్ జరుగుతోంది.


'ప్రతి ఓడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్లు ... ఎలపరం వచ్చేస్తోంది..." అనే డైలాగు పవన్ కళ్యాణ్‌ని, బాలకృష్ణని ఉద్దేశ్యించి చేసినవిగా భావించి పవన్ ఫ్యాన్స్ తో పాటు, బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఈ తగువులో పాలు పంచుకుంటున్నారు.


ఇంటర్నెట్ లో ఒక రేంజ్ లో సాగుతున్న ఈ పోరుకి ఫుల్ స్టాప్ పెట్టడానికి మహేష్ తొలి ప్రయత్నం చేశారు. బుధవారం, హైదరాబాదులో ఒక మొబైల్ కంపెనీ నిర్వహించిన అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్న మహేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో పులులు, సింహాలు అని చెప్పిన డైలాగ్ సినిమా ఎవరినీ ఉద్దేశించినది కాదని, టాప్ హీరోలందరి మీద తనకు గౌరవం వుందని చెప్పుకొచ్చారు.ఈ టీజర్ రిలీజ్ చెయ్యటంలో ఎవరినీ విమర్శించే ఉద్దేశ్యం లేదని వివరించారు. అలాగే ఇలాంటి డైలాగ్ దూకుడు సినిమాలో కూడా తాను చెప్పానని గుర్తుచేశారు. ఆగడు సృష్టించిన రగడ మహేష్ నేరుగా ఇచ్చిన క్లారిటీతోనైనా ఆగుతుందేమో చూడాలి.


జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.