English | Telugu

'మహాభారత్' నటుడి మరణం.. కారణమిదే!

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గురువారం (సెప్టెంబర్ 14).. 'మహాభారత్'లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు కన్నుమూశారు.

వివరాల్లోకి వెళితే.. దిల్ చాహ్తా హై, చక్ దే ఇండియా, మర్దాని చిత్రాలతో సినీ పరిశ్రమలోనూ.. సప్నే సుహానే లడక్ పాన్ కే, మహాభారత్ సీరియల్స్ తో టీవీ పరిశ్రమలోనూ గుర్తింపు పొందిననటుడు రియో కపాడియా (66). మూడు దశాబ్ధాల అభినయ పర్వంలో పలు ధారావాహికల్లో అలరించారాయన. కాగా, గత ఏడాది నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న రియో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్ను మూశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు తెలియజేశారు. అలాగే, శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కాగా, మహాభారత్ లో రియో కపాడియా గాంధారి తండ్రి పాత్ర పోషించారు. గాంధార రాజు సుబల వేషంలో తనదైన అభినయంతో మెప్పించారు. ఇక చివరిసారిగా ఆయన మేడ్ ఇన్ హెవెన్ 2 అనే వెబ్ సిరీస్ లో కనిపించారు. అందులో మృణాళ్ తండ్రిగా ఆకట్టుకున్నారు. ఇక రియో కపాడియా వ్యక్తిగత విషయానికి వస్తే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .