English | Telugu

అంచనాలు పెంచేసిన బాలయ్య టీజర్

బాలకృష్ణ తన ప్రతి సినిమాలో కూడా సింహ అనే పేరు వచ్చే విధంగా పెట్టిన టైటిల్స్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించాయి. "సమరసింహారెడ్డి", "నరసింహ నాయుడు", "లక్ష్మీ నరసింహ"..తాజాగా "సింహ". ఇలా సింహ అనే పదం ఉన్న ప్రతి సినిమా కూడా ఆయనకు అదృష్టంగా విజయాన్ని చేకూర్చింది. అయితే ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న "లెజెండ్" సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యాయి. అదే విధంగా స్మాల్ టీజర్ నిన్న సాయంత్రం విడుదలైంది. వీటన్నిటిని చూస్తుంటే వెండితెర మీద సింహం లాంటి బాలకృష్ణ, టైటిల్లో ఎంతో రాజసం ఉట్టిపడేలా "లెజెండ్". నందమూరి అభిమానులకు ఇంతకంటే ఇంకేం కావాలి.


అయితే బాలయ్యకు నరసింహ స్వామి అంటే ఎంతో అపారమైన భక్తి. కానీ ఈ సినిమాలో బాలయ్య మెడ దగ్గర ఓ టాటూ ఉంది. ఓంకారం-త్రిశూలం కలిపిన టాటూను బాలయ్య మెడ దగ్గర కనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో బాలయ్య శివుడి భక్తుడిగా కనిపించనున్నాడా లేక కేవలం అది ఒక లుక్ కోసం మాత్రమే పెట్టారా అనే సంగతి త్వరలోనే తెలియనుంది. ఏదేమైనా కూడా బాలయ్య సినిమా అంటే ఎప్పుడు కూడా ఒక హాట్ టాపిక్.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలను మార్చి 7న శిల్పకళా వేదికలో విడుదల చేయనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మార్చి 28న లేదంటే ఏప్రిల్ 4న "లెజెండ్"ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో, 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.