English | Telugu

'కింగ్ ఆఫ్ కొత్త' ఫస్టాఫ్ రివ్యూ: దుల్కర్ దుమ్ము దులిపేశాడు!

'మహానటి', 'సీతారామం' చిత్రాలతో తెలుగువారికి చేరువైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. తాజాగా ఈ యంగ్ హీరో నుంచి వచ్చిన సినిమా 'కింగ్ ఆఫ్ కొత్త'. ప్రధానంగా మలయాళంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. గురువారం (ఆగస్టు 24) తెలుగులోనూ విడుదలైంది. నూతన దర్శకుడు అభిలాష్ జోషి తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా, ప్రసన్న ఓ ముఖ్య పాత్రలో అభినయించాడు. 2 గంటల 55 నిమిషాల నిడివితో 'కింగ్ ఆఫ్ కొత్త' జనం ముందు నిలచింది.

ప్రస్తుతం థియేటర్స్ లో ప్రదర్శితమవుతున్న 'కింగ్ ఆఫ్ కొత్త' ఫస్టాఫ్ పూర్తిచేసుకుంది. ఫస్టాఫ్ పై వచ్చిన రివ్యూ ఎలా ఉందంటే.. దుల్కర్ సల్మాన్ పోషించిన రాజు పాత్ర ఆసక్తికరంగా ఉందని, యాక్టింగ్కూడా ఎప్పటిలాగే అదరగొట్టాడని చెబుతున్నారు. అలాగే కొన్ని కామెడీ సీన్స్ డీసెంట్ గా ఉన్నాయని అంటున్నారు. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం చాలా బాగుందని, కాకపోతే సినిమా మాత్రం స్లో నెరేషన్ తో సాగిందని రిపోర్ట్. ఓవరాల్ గా.. 'కింగ్ ఆఫ్ కొత్త' ఫస్టాఫ్ వరకు చూస్తే యావరేజ్ అనే రిపోర్ట్ వచ్చింది. మరి.. సెకండాఫ్ ఎలా ఉందో తెలియాలంటే కొంతసమయం వేచిచూడాల్సిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.