English | Telugu

మంచి రేటింగ్స్ సంపాదించిన డబ్బింగ్ చిత్రాలు ఏమిటి!?

టాలీవుడ్ లో ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు నిర్మితమవుతూ ఉంటాయి. వీటితోపాటు తమిళ మలయాళ కన్నడ పరిశ్రమల నుంచి విడుదలైన చిత్రాలు తెలుగులోకి డ‌బ్ అవుతూ ఉంటాయి. అలా డ‌బ్ అయిన చిత్రాలు కూడా ఇక్కడ ఘనవిజయం సాధిస్తుంటాయి. ఇక కమలహాసన్, రజనీకాంత్, సూర్య‌, కార్తీ ఇలాంటి పరభాష హీరోలకు కూడా ఇక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు అయితే అవి తమిళ్ మలయాళం కన్నడ ఏ భాష అయినా కూడా తెలుగులో మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి.

తెలుగు ప్రేక్షకులు అలాంటి వాటికి బ్రహ్మరథం పడతారు. టాలీవుడ్ లో చాలామంది తమిళ హీరోలు సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నారు. బుల్లితెరపై కూడా రికార్డు స్థాయిలో టిఆర్పిలు సొంతం చేసుకున్నారు. తెలుగు హిట్ చిత్రాల‌కు వచ్చే రేటింగ్ కంటే కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ టిఆర్పి రావడం విశేషం. ఇందులో మొదటి స్థానం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో చిత్రం. దీనికి 19.04 టీఆర్పి వచ్చింది. తరువాత విజయ్ ఆంటోనీ బిచ్చగాడు ఈ సినిమాకు 18.78 టీఆర్పి వచ్చింది. మూడో స్థానంలో రజనీకాంత్ క‌బాలి చిత్రం 14.5 2 టిఆర్పి తో సొంతం చేసుకుంది. కాంచన 2 చిత్రం 13.1 టిఆర్పిని సొంతం చేసుకుని నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో 12.35 టిఆర్పి తో రిషబ్ శెట్టి హీరోగా నటించిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కాంతారా నిలుస్తోంది.

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు కూడా కాంతారా స్థాయిలో రేటింగ్‌ను రాబట్ట లేకపోయాయి. అలాంటి కాంతారా మూవీ బుల్లితెరపై రికార్డు స్థాయిలో టిఆర్పి సొంతం చేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా 60 కోట్లకు పైగా తెలుగులో వసూలు చేయడం విశేషం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.