English | Telugu

నిర్మాతలకు ఆదర్శంగా నిలుస్తున్న కళానిధి మారన్‌!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ‘రోబో’ చిత్రాన్ని నిర్మించి పెద్ద విజయాన్ని అందుకున్న కళానిధి మారన్‌ ఆ తర్వాత రజనీతోనే చేసిన ‘పేట’, ‘అన్నాత్తై’ చిత్రాల వల్ల ఎంతో నష్టపోయాడు. తాజాగా రజనీ హీరోగా నెల్సన్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘జైలర్‌’ ఘన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్‌ చేసింది. ఇప్పటివరకు తమిళ్‌లో ఇలాంటి ఘనవిజయం నమోదు కాలేదు. అంతటి ఘన విజయంలో కీలక పాత్రలు పోషించిన రజనీకాంత్‌, నెల్సన్‌, అనిరుధ్‌లకు చెక్‌లు, బహుమతులు అందించి తన ఆనందాన్ని వారితో పంచుకున్నారు మారన్‌.
అంతటితో ఆగకుండా తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కూడా ఉపయోగించేందుకు ముందుకొచ్చారు మారన్‌. సన్‌ పిక్చర్స్‌ తరఫున కళానిధి మారన్‌ భార్య కావేరి ఇటీవల అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌, ఉపాసన కొణిదెల తాతగారైన డా॥ ప్రతాప్‌ చంద్రారెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్‌ను అందించారు. 100 మంది నిరుపేద పిల్లల గుండె ఆపరేషన్‌ కోసం ఈ మొత్తాన్ని వినియోగిస్తారు. సన్‌ పిక్చర్స్‌ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని అందరూ హర్షిస్తున్నారు. ఎంతో మంది నిర్మాతలకు కళానిధి మారన్‌ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు సమాజానికి ఎంతో అవసరం అంటున్నారు. సన్‌ పిక్చర్స్‌లో మరిన్ని మంచి సినిమాలు రావాలని, మంచి లాభాలు ఆర్జించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నెటిజన్లు ఆశిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.