English | Telugu

యన్ టి ఆర్ ఊసరవెల్లి పాటకి 3 గురు కొరియోగ్రాఫర్లు

యన్ టి ఆర్ "ఊసరవెల్లి" పాటకి 3 గురు కొరియోగ్రాఫర్లు పనిచేయనున్నారట. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, ప్రముఖ బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న విభన్నకథా చిత్రం "ఊసరవెల్లి". యన్ టి ఆర్ "ఊసరవెల్లి" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రంలోని ఒక పాటకు వెస్ట్రన్, క్లాసిక్ రెండూ కలిపి ఒక అద్భుతమైన ట్యూన్ అందించారట.

స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన హీరో యన్ టి ఆర్ ఈ పాటకు డ్యాన్స్ చేయాలంటే ఆయన శక్తికి తగ్గట్టు డ్యాన్స్ కంపోజ్ చేయటానికి ఒక కొరియోగ్రాఫర్ వల్ల కాదని భావించిన దర్శకుడు సురేంద్ర రెడ్డి ఈ పాటను ముగ్గురు కొరియోగ్రాఫర్లతో డ్యాన్స్ కంపోజ్ చేయించి చిత్రీకరిస్తున్నారట. ఈ మధ్య యన్ టి ఆర్ నటించిన చిత్రాల్లోని పాటల్లో ఆయన చేసిన డ్యాన్స్ ఆయన అభిమానులను అనుకున్నంత బాగా ఆకట్టుకోలేదన్నది వాస్తవం. అదీ గాక ఈ మధ్య అల్లు అర్జున్ సినిమాల్లోని పాటల్లో డ్యాన్స్ బాగుండటం కూడా ఇలా యన్ టి ఆర్ చేయటానికి కారణం కావచ్చు అనుకుంటున్నారు సినీ జనం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.