English | Telugu

స్టార్స్ ప్లాన్ వ‌ర్కౌట్ అయితే ఇక‌ అదుర్స్!

సినిమా బాగుండడమే కాదు ఆ సినిమా సక్సెస్ కావాలంటే ఎన్నో అంశాలు కలిసి రావాలి. పోటీగా సినిమాలు లేకుండా ఉండాలి. మంచి ప్రమోషన్ చేయాలి. సినిమా కంటెంట్ నచ్చేలా ఉండాలి.. సరైన సమయంలో విడుదల చేయాలి. అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయాలి. ప్రేక్షకులను దియేటర్లకు ర‌ప్పించేలా చేయగలగాలి... ఇలాంటి అంశాలు ఎన్నో కలిస్తేనే ఓ సినిమా సక్సెస్ అవుతుంది. ఈ విషయంలో మన టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. నాని దసరా, ప్రభాస్ సలార్, ఎన్టీఆర్ 30 చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దసరా చిత్రం మార్చి 30న అంటే గురువారం విడుదల కానుంది.

ఈ సమయంలో ఏ సినిమాలు పోటీగా లేవు. దాంతో వీకెండ్ హాలిడేస్ తో ప్రేక్షకులు అభిమానులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. కంటెంట్ క్లిక్ అయితే ఆడియన్స్ భారీగా వస్తారు. ఇక సలార్ విషయానికి వస్తే సెప్టెంబర్ 8న గురువారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. లాంగ్ వీకెండ్ ఉండనుంది. వినాయక చవితి హడావుడి కూడా ఉంటుంది. దాంతో పండుగను పురస్కరించుకొని ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆసక్తి చూపుతారు. ఇక ఎన్టీఆర్ 30 వచ్చే ఏడాది ఏప్రిల్ 5న శుక్రవారం విడుద‌ల కానుంది. ఎన్టీఆర్ నటించే చిత్రం కనుక వీకెండ్ ని క్యాష్ చేసుకుంటుంది. అటు ఇటుగా అప్పుడే స్టూడెంట్స్‌కు పరీక్షలు కూడా పూర్తవుతాయి. ఇవన్నీ ఎన్టీఆర్ 30కి కలిసి రానున్నాయి. ఈ విధంగా ఈ మూడు చిత్రాలు మంచి డేట్స్ ప్లాన్ చేసుకొని విడుదల కానున్నాయి. ఇలా కలిసొచ్చే అంశాలతో ఈ మూడు చిత్రాలు కంటెంట్ కూడా క్లిక్ అయితే బాక్సాఫీస్ మోత మోగడం ఖాయమని చెప్పాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.