English | Telugu

త‌న‌కు అడుక్కోవాల్సిన అవ‌స‌రం లేదంటున్న స‌మంత‌

ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ సమంత గురించే మాట్లాడుతున్నారు. ఓవైపు శాకుంతలం ప్రమోషన్లలో పాల్గొంటున్న ఆమె, మరోవైపు ఈ ప్రమోషన్లలోనే నెక్స్ట్ ప్రాజెక్టులు ఖుషి, సిటాడెల్ గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా నార్త్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత పారితోషికాల గురించి చాలా విషయాలు మాట్లాడారు. పారితోషికాన్ని పురుషులతో సమానంగా అందుకోవడానికి తను చాలా కష్టపడుతున్నట్లు తెలిపారు. అయితే తానుప్రత్యక్షంగా కష్టపడుతున్నట్టు అందరికీ చూపిస్తూ ప‌నులు చేయ‌డం లేదని, తను చేస్తున్న పనికి అవతల వాళ్ళు డ‌బ్బు తెచ్చి ఇచ్చే విధంగానే ప్రవర్తిస్తున్నానని అన్నారు. తను అడుక్కోవడానికి సిద్ధంగా లేనని చెప్పారు. తన పని తీరు తనకు మార్కెట్లో ఒక విలువని క్రియేట్ చేస్తుందని, `మీకు ఇంత ఇద్దాం అనుకుంటున్నాం` అని అవతలి వాళ్ళు చెప్పేలా అది చేస్తుందని, అలాంటి విషయాలు తనకు నమ్మకం ఎక్కువ అని చెప్పారు సమంత.

అంతేకాదు, మామూలుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనుకునేవాళ్లు ఎక్కువ కష్టపడాలని... అమ్మాయిలు ఇంకా ఎక్కువ కష్టపడాలని అన్నారు. ఇంకా ఎక్కువలో తను చెప్పదలుచుకున్న విషయాలు చాలా ఉన్నాయని, ఎప్పటికప్పుడు కంఫర్ట్ జోన్‌ని వదిలిపెట్టి కష్టపడి తమ ప్రతిభను పెంపొందించుకోవడానికి కృషి చేయాలని చెప్పారు సమంత. ప్రస్తుతం ఖుసి, సిటాడెల్‌లో నటిస్తున్నట్టు చెప్పారు. విజయ్ దేవరకొండని వీడి అంటారని అందరికీ తెలుసు. అలాగే వరుణ్ ధావన్ కూడా నార్త్ లో వీడి అంటారు. సౌత్ వీడితోనూ నార్త్ వీడితోనూ కలిసి ఒకేసారి నటిస్తుండడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు సమంత. తను అమితంగా ఇష్టపడే రాజ్‌, డీకే డైరెక్షన్లో మరోసారి సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. అదే విధంగా శివ నిర్వాణా లాంటి సెన్సిబిలిటీస్ ఉన్న‌ డైరెక్టర్ తో పని చేయడం పట్ల సంతోషంగా ఉన్నట్టు ప్రకటించారు సమంత.

శాకుంతలం సినిమాని తొలుత తాను ఒప్పుకోలేదని, తన బౌండరీస్ ని దాటి తాను ఈ సినిమాను ఒప్పుకున్నట్టు చెప్పారు. తన అనారోగ్యంగా ఉన్న ఎనిమిది నెలల్లో ఎంతో నేర్చుకున్నానన్నారు. ఆ సమయానికి విలువనిస్తున్నానని అన్నారు. ఆ సమయంలో నేర్చుకున్న విషయాలు తన జీవితం మీద చాలా ప్రభావం చూపించాయని చెప్పుకొచ్చారు సమంత. తను సెట్ లో ఉన్నప్పుడు `ఈ సీను జస్ట్ ఓకేగా వస్తే చాలు` అని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉండేలాగనే తాను నటిస్తానని అన్నారు. అలా చేసినప్పుడే తనకు ఆత్మసంతృప్తి కలుగుతుందని అన్నారు. ఎప్పుడు తను సెట్ లో డల్లుగా ఉండనని అన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.