English | Telugu

రామ్ చరణ్ పై అల్లు అర్జున్ పైచేయి సాధిస్తాడా? 

టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు మళ్ళీ విడుదలై ఒక్క రోజులోనే కోట్లలో గ్రాస్ వసూలు చేసి సత్తా చాటాయి. రీరిలీజ్ సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా రూ.4 కోట్లకు పైగా గ్రాస్ తో 'ఖుషి' టాప్ పొజిషన్ లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో రూ.3 కోట్లకు పైగా గ్రాస్ తో 'జల్సా', రూ.2 కోట్లకు పైగా గ్రాస్ తో 'ఒక్కడు', రూ.1.7 కోట్లకు పైగా గ్రాస్ తో 'పోకిరి' ఉన్నాయి. ఇటీవల మళ్ళీ విడుదలైన 'ఆరెంజ్' సైతం మొదటి రోజు రూ.1.5 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ఇక ఇప్పుడు 'దేశముదురు' వంతు వచ్చింది.

అల్లు అర్జున్, హన్సిక జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'దేశముదురు'. 2007, జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాలోని కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బన్నీ సిక్స్ ప్యాక్ తో కనిపించడం విశేషం. ఆయన స్టైల్ కి, డ్యాన్స్ లకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక చక్రి సంగీతం అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమాకి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుంది. అందుకే రీరిలీజ్ సెలబ్రేషన్స్ కి ఈ సినిమాని ఎంచుకున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు(ఏప్రిల్ 8) వేడుకల్లో భాగంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న విడుదల చేయబోతున్నారు. 'దేశముదురు' రీరిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి వసూళ్ల పరంగా ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 'ఆరెంజ్'ని దాటేసి టాప్-5 లో నిలుస్తుందేమో చూద్దాం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.