English | Telugu

ఎంతకు తెగించార్రా.. డబ్బులిచ్చి ట్రోలింగ్‌ చేయిస్తున్నారట!

ఒకరు బాగుపడి ఉన్నత స్థాయికి వెళుతున్నారంటే ఓర్వలేని వాళ్ళు, కిందకు లాగెయ్యాలని ట్రై చేసే వాళ్ళు ఏ రంగంలోనైనా ఉంటారు. అలాగే సినిమా రంగంలో కూడా కొందరిలో ఈ ధోరణి కనిపిస్తుంది. అయితే బయటికి నవ్వుతూ పలకరించుకున్నా లోపల మాత్రం వారు నాశనం అవ్వాలని కోరుకుంటారు. నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకొని వరస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక మందన్న విషయంలో ఇదే జరుగుతోందని తెలుస్తోంది. పుష్ప, యానిమల్‌, పుష్ప2, ఛావా, కుబేర వంటి స్టార్స్‌ సినిమాల్లో నటించి హీరోయిన్‌గా దూసుకెళ్తున్న రష్మిక కొందరు పనిగట్టుకొని ట్రోలింగ్‌ చేస్తున్నారు.

తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ గురించి ఒక ఇంటర్వ్యూలో స్పందించారు రష్మిక మందన్న. ‘సోషల్‌ మీడియాలో నన్ను టార్గెట్‌ చేస్తూ కొందరు ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇది నేచురల్‌గా నెటిజన్లు చేసే ట్రోలింగ్‌ కాదు. నన్ను అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు కావాలనే ఇదంతా చేస్తున్నారు. అలా ట్రోల్‌ చేసినందుకు డబ్బులు కూడా ఇస్తున్నారు. నన్నెందుకు టార్గెట్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేనంటే కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు. అందరికీ నేను నచ్చాలని లేదు. అది నాకూ తెలుసు. కానీ, ఇలాంటి పనులు చేయడం కరెక్ట్‌ కాదు. టాలెంట్‌ ఉన్నవారిని, హార్డ్‌ వర్క్‌ చేసేవారిని ఎవరూ ఆపలేరు’ అన్నారు.

రష్మిక చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సోషల్‌ మీడియా అలర్ట్‌ అయిపోయింది. దీని గురించే నెటిజన్లు బాగా డిస్కస్‌ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది రష్మికను సపోర్ట్‌ చేస్తున్నారు. కొందరు మాత్రం అలా ట్రోల్‌ చెయ్యడానికి ఆమె ప్రవర్తనే కారణం అంటున్నారు. మరికొందరు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని ధైర్యం చెబుతున్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.