English | Telugu

100 కోట్ల జీనీ మూవీ మొద‌లైంది

వేల్స్ ఇంటర్నేషనల్ 25వ సినిమా జీని మొదలైంది. పూజా కార్య‌క్రమాల‌తో ప్రాజెక్ట్ లాంఛ‌నంగా మొద‌లైంద‌ని చెబుతూ మేకింగ్ వీడియో విడుదల చేశారు మేకర్స్. అత్యంత ఆత్మీయుల సమక్షంలో పాన్ ఇండియా ప్రాజెక్టుగా జీనిని అనౌన్స్ చేశారు. జయం రవి, దేవయాని, కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, వామిక గబ్బి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్ ముత్తుస్వామి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ స్టంట్ ఎక్స్ ప‌ర్ట్ యానిక్ బెన్ రంగంలోకి దిగారు. ఉమేష్ జయ కుమార్ ఆర్ట్ వర్క్ ని డీల్ చేస్తున్నారు. పూజా కార్యక్రమం అనంతరం రెండు రోజులు సినిమా షూటింగ్ ఉంటుంది. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుంటారు.

జూలై 20 నుంచి ఫ్రెష్ షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తారు. వేల్స్ ఇంటర్నేషనల్ 25వ సినిమా కావడంతో అత్యంత భారీగా ఈ సినిమాను తెర‌కెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఆల్రెడీ పొన్నియ‌న్‌ సెల్వన్ పార్ట్ వన్ పార్ట్ టూ తో జయం రవి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ జీని లోను కథ‌ చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆయన కెరీర్ కు ఎంతో దోహదపడుతుందని అంటున్నారు మేకర్స్. మిస్కిన్ దగ్గర పనిచేసిన అర్జున‌న్ జూనియర్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఐస‌రి కే గణేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని వేల్స్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. జయం రవి కెరియర్లో అత్యద్భుతమైన చిత్రంగా నిలుస్తుందని చెప్పారు మేకర్స్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.