English | Telugu

థియేటర్లలో నేడు 5 సినిమాలు

ప్రజలు రాజకీయ గొడవలతో అల్లాడుతుంటే వారికి కాస్త వినోదాన్ని పంచడానికి నేడు(మార్చి 21) ప్రేక్షకుల ముందుకు 5 సినిమాలు వస్తున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు కాగా.. మిగిలిన మూడు సినిమాలు డబ్బింగ్ సినిమాలు.

శ్రీకాంత్, తరుణ్, మధురిమ, జాస్మిన్ భాసిన్ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన చిత్రం "వేట". తేజ సినిమా బ్యానర్లో నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి అశోక్ అల్లే దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు.

నవకేష్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "గీత". కొమ్మి శివరామయ్య సమర్పణలో కొమ్మి కౌశల్యదేవి నిర్మించిన ఈ చిత్రానికి రామారావు ఏలేటి దర్శకత్వం వహించారు. వేదకాలం నాటి అంశాలతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమస్యలను ఎలా రూపుమాపాలో ఈ చిత్రంలో చూపించారు. పద్మనావ్ సంగీతం అందించారు.

అజిత్, తమన్నా జంటగా నటించిన తమిళ సూపర్ హిట్ "వీరం" చిత్రాన్ని తెలుగులో వీరుడోక్కడే పేరుతో డబ్బింగ్ చేసారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. తమిళంలో 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మరి తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

ప్రముఖ నటుడు ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు, సురభి జంటగా నటించిన తాజా చిత్రాన్ని తెలుగులో "సిటిజన్" పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు. శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుబ్రహ్మణ్యం బి, సురేష్ ఎన్, ఎన్ సుభాష్ చంద్రబోస్ సంయుక్తంగా నిర్మించారు. రౌడీయిజంపై ఓ సామాన్య పౌరుడు ఎలా పోరాటం సాగించాడన్నది ఈ సినిమా సారాంశం.

అశోక్ సెల్వన్, జనని జంటగా నటించిన చిత్రం "భద్రమ్". శ్రేయాస్ మీడియా, పుష్యమి ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రమేష్ దర్శకత్వం వహించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నివాస్ సంగీతం అందించారు. ఈ 5 చిత్రాలు ఎలాంటి విజయం దక్కించుకుంటాయో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.