English | Telugu

తేజ స్టార్స్ ఎక్కడున్నారో...

తేజ స్టార్స్ ఎక్కడున్నారో... అని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే సినిమాటోగ్రాఫర్ గా ఉన్నతేజ ఉషాకిరణ్ మూవీస్ వారి "చిత్రం" సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమాలో అందరూకొత్తవారినే నటీనటులుగా ప్రమోట్ చేశాడు తేజ. ఆ చిత్రంతోనే ఉదయ కిరణ్, రీమాసేన్ హీరోహీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్నేళ్ళు తెలుగు తెరను ఏలాడు తేజ. "నువ్వు-నేను, జయం" వంటి సూపర్ హిట్ సినిమాలు అతన్నుంచి వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ వెనకపడ్డాడు తేజ.

ప్రస్తుతం తన స్కూల్లోనే వెళ్ళి ఘనవిజయం సాధించాలనే కృత నిశ్చయంతో ఉండి కొత్త సినిమా తీస్తున్నాడు తేజ. ఆ సినిమాలో నటించటానికి అందరూ కొత్తవారినే తీసుకుంటున్నాడు. చివరికి ఫేస్ బుక్ ని కూడా వదలకుండా తనకు కావలసిన వారి కోసం వెదుకుతున్నాడు. శేఖర్ కమ్ముల కూడా "లీడర్" సినిమా కోసం ఫేస్ బుక్ లోనే వెతికాడు. అలా దొరికినమ్మాయే ప్రియా ఆనంద్. మరి తేజ స్టార్స్ ఎక్కడున్నారో...!

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.