Read more!

English | Telugu

డైరెక్టర్ బుచ్చిబాబుని భయపెట్టిన దక్షిణ!

'మంత్ర', 'మంగళ' సినిమాలతో టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ "దక్షిణ " మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్ నిర్మాణంలో అశోక్ షిండే నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'కబాలి' ఫేమ్ సాయి ధన్షిక కథానాయికగా నటిస్తుండగా.. మహాభారత్ మర్డర్స్ ఫేమ్ రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ కు విశేష స్పందన లభించింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు విడుదల చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ... ఈ మధ్య కాలం లొ నన్ను భయపెట్టిన ట్రైలర్ ఇదే అన్నారు. మళ్ళీ తులసి రామ్ గారు టాలీవుడ్ కి మరో ట్రెండ్ సెట్టర్ సైకో థ్రిల్లర్ ని 'దక్షిణ' సినిమాతో ఇవ్వబోతున్నారు అంటూ అభినందించారు.

ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు చిత్ర బృందం పాల్గొన్నది. దక్షిణ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేవుతోందని  త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత అశోక్ షిండే తెలిపారు.