English | Telugu

వాళ్ళకి సంబంధించిన సీక్రెట్ ని బయటపెట్టిన దిల్ రాజు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెలుగు చిత్ర సీమకి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించిన నిర్మాత దిల్ రాజు. హీరోని ,హీరోయిన్ ని, దర్శకుడు ని చూసి సినిమాకి వెళ్లే ప్రేక్షకులని నిర్మాతని చూసి కూడా థియేటర్స్ కి వెళ్లేలా చేసింది దిల్ రాజు నే అని చెప్పవచ్చు.అలాగే ప్రస్తుత రోజుల్లో నిర్మాతకి గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి కూడా ఆయనే. తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కొత్త దర్శకులని పరిచయం చేసిన దిల్ రాజు పంపణీదారుడుగా మారి ఎన్నో మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులకి అందించాడు. తాజాగా ఆయన తన డిస్టిబ్యూటర్ల గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం థియేటర్స్ దగ్గర రికార్డు కలెక్షన్స్ ని సాధిస్తున్న అనిమల్ మూవీతో పాటు బింబిసార, పొన్నియన్ సెల్వం ,జైలర్ ,దసరా, లవ్ టుడే, మాసూద లాంటి పలు చిత్రాలన్నింటిని దిల్ రాజు నే రెండు తెలుగు రాష్ట్రాల్లో పంపిణి చేసారు. ఈ సినిమాలన్నీ కూడా తన డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు తెచ్చిపెట్టాయని అందుకు తనకి చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు చెప్పాడు. అలాగే ఆ సినిమాలని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కూడా దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు . ఇక ముందు కూడా మంచి చిత్రాల్ని అందిస్తానని కూడా ఆయన చెప్పాడు.

దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.రామ్ చరణ్ ,విజయ్ దేవరకొండ లాంటి హీరో ల చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. అలాగే ఇంకొన్ని చిత్రాల పంపిణి హక్కులని కూడా ఆయన పొందటం జరిగింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.