English | Telugu

దాసరికి యస్వీఆర్ పురస్కార అవార్డు

దాసరికి యస్వీఆర్ పురస్కార అవార్డు లభించింది. జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ వారి యస్వీఆర్ పురస్కార అవార్డుని ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న, డాక్టర్ దాసరి నారాయణకు అందజేయనున్నారు. జూలై 3 వ తేదీ, సాయంత్రం 6 గంటలకు, రవీంద్ర భారతిలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేస్తారు. ఈ యస్వీఆర్ పురస్కార అవార్డు ఫంక్షన్ కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యన్.కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.

ఈ అవార్డు అందుకోనున్న దాసరి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో, ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుడిగా తన పేరు నమోదు చేసుకున్నారు. ఆయన 150 సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో "తాత-మనవడు" నుండి "ప్రేమాభిషేకం, బొబ్బిలిపులి, మేఘసందేశం, శివరంజని, తూర్పు-పడమర" వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలూ, సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలూ అనేకం ఉన్నాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.