English | Telugu

తన విడాకుల గురించి కలర్స్ స్వాతి ఏమందో తెలుసా?

స్వాతి అనే పేరు చెప్పగానే అందరికీ ఫ్లాష్‌ అవ్వకపోయినా, కలర్స్‌ స్వాతి అనగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే కలర్స్‌ అనే ప్రోగ్రామ్‌ అప్పట్లో అంత పాపులర్‌. ఆ పేరు వల్ల ఆ ప్రోగ్రామ్‌ పాపుల్‌ అవ్వలేదు. కేవలం స్వాతి వల్లే దానికి అంత పేరు వచ్చింది. ఆ ప్రోగ్రామ్‌లో తన మాటలతో, చలాకీతనంతో అందర్నీ ఆకట్టుకున్న స్వాతి ఆ తర్వాత సినిమాల్లోనూ తనదైన మార్క్‌తో అలరించింది. అయితే హీరోయిన్‌గా చేసిన సినిమాలు తక్కువే అయినా కొన్ని చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్‌ చేసింది. 2018లో వికాస్‌ వాసు అనే వ్యక్తిని వివాహం చేసుకొని అమెరికా వెళ్ళిపోయింది. ఆ విధంగా సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత 2021లో పంచతంత్రం అనే సినిమాతో మళ్ళీ టాలీవుడ్‌కు వచ్చింది స్వాతి. ప్రస్తుతం నవీన్‌చంద్రతో కలిసి ‘మంత్‌ ఆఫ్‌ మధు’ అనే సినిమా చేస్తోంది. 2015లో వచ్చిన ‘త్రిపుర’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ‘మంత్‌ ఆఫ్‌ మధు’కి సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో స్వాతి తన పర్సనల్‌ విషయాలను కూడా షేర్‌ చేసుకుంది. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సరదాగా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ‘మీరు విడాకులు తీసుకున్నారా?.. ఈ విషయంలో క్లారిటీ ఇస్తారా?’ అని ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నేనివ్వ...’ అంటూ తన స్టైల్‌లోనే సమాధానం చెప్పింది. ‘అంటే.. విడాకులు ఇవ్వనంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వనంటున్నారా?’ అంటూ క్లారిటీగా అడిగిన ప్రశ్నకు అంతే క్లారిటీగా ‘నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వను అంటున్నాను’ అని చెప్పింది.

స్వాతి ఈ సమాధానాన్ని ఎంతో సరదాగా చెప్పినప్పటికీ అదే ఇప్పుడు వైరల్‌గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్వాతి, వికాస్‌ విడాకులు తీసుకున్నారనే రూమర్‌ వినిపిస్తోంది. విడిపోయారు కాబట్టే వారిద్దరికీ సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియా నుంచి స్వాతి తీసివేసిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అయితే స్వాతి, వికాస్‌ విడాకుల విషయంలో ఇప్పటికీ క్లారిటీ అనేది లేదనేది వాస్తవం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.