English | Telugu

చిరు డ‌బుల్ గేమ్‌!

అటు వినాయ‌క్ - ఇటు పూరి జ‌గ‌న్నాథ్ - చిరు 150వ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌డం లేదు. ఇప్పటి వ‌ర‌కూ అధికారికంగా ప్ర‌క‌టించినట్టుగా చిరు సినిమాకి పూరినే ద‌ర్శ‌కుడు. కాక‌పోతే.. పూరికి చిరు ఏ క్ష‌ణంలో అయినా హ్యాండివొచ్చ‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. ఎందుకంటే వినాయ‌క్ కూడా ఇప్పుడు చిరు కోసం క‌థ సిద్ధం చేసే ప‌నిలో ఉన్నార‌ట‌.

ఆటోజానీ ఫ‌స్టాఫ్ బాగానే ఉన్నా.. సెకండాఫ్ సంగ‌తి ఇంకా తేల్చ‌క‌పోవ‌డం, జ్యోతిల‌క్ష్మి ఫ్లాపు.. చిరుని నిరుత్సాహ‌ప‌రిచాయి. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి పూరిని త‌ప్పించ‌డానికి ఆయ‌న రంగం సిద్ధంచేశారు. పూరిని త‌ప్పించేలోగా వినాయ‌క్‌తో క‌థ ఓకే చేయించాల‌న్న‌ది చిరు ప్ర‌య‌త్నం. చిరు 150వ సినిమా బాధ్య‌త‌ల్ని భుజాన వేసుకోవ‌డానికి సిద్ధంగా లేక‌పోయినా... అన్న‌య్య అడిగాడ‌ని వినాయ‌క్ కూడా హ‌డావుడిగా రంగంలోకి దిగారు. ఆయ‌న ఆస్థాన ర‌చ‌యిత‌ల్ని హుటాహుటిన త‌న ఆఫీసుకు పిలిపించుకొని... `చిరు కోసం ఏమైనా క‌థ ఉందా..?` అంటూ ఆరాలు తీస్తున్నారు.

చిరంజీవి 150వ సినిమా కోసం ముందుగా అనుకొన్న‌ది వినాయ‌క్ పేరే. అప్ప‌ట్లో సిద్ధం చేసిన క‌థ‌ల్ని ఇప్పుడు మ‌ళ్లీ బ‌య‌ట‌కు తీస్తున్న‌ట్టు భోగ‌ట్టా. చిరు కి కూడా ఈ డ‌బుల్ గేమ్ బాగుంది. ఎవ‌రు మంచి క‌థ‌తో వ‌స్తే. వాళ్లతో ప్రొసీడ్ అయిపోదామ‌ని చూస్తున్నాడు చిరు. మ‌రి ఆ ఒక్క‌రు ఎవ‌ర‌న్న‌ది చిరు అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.