English | Telugu

సమంత ఛార్మిల ఐటెంసాంగ్..!

'ఐ' మూవీ తర్వాత విక్రమ్ నటిస్తున్న సినిమా 'పత్తుఎన్‌రాధుకుల్లా'. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా చేస్తోంది. లేటెస్ట్ కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ఛార్మి ఓ స్పెషల్ సాంగ్ చేస్తోందట. ఈ పాట కోసం పూణెలో రూ.2.5 కోట్లు వెచ్చించి మరీ ఓ ప్రత్యేకమైన సెట్ వేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ సాంగ్ దాదాపు 9 నిమిషాలపాటు కొనసాగుతుందట. ఈ పాటకోసం చార్మీని సంప్రదించగా.. కాన్సెప్ట్ తెగ నచ్చేయడం వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ స్పెషల్ సాంగ్ లో ఛార్మీ తో పాటు సమంత కూడా స్టెప్స్ వేయనుంది. అక్టోబర్ 20 తర్వాత ఈ పాటని చిత్రీకరిస్తారు. నవంబర్ కల్లా మూవీ షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .