English | Telugu

రాజ‌మౌళి కాదు.. మోళి!!

ఔను... రాజ‌మౌళికి మోళి చేయ‌డం వ‌చ్చు. అదేనండీ.. మాయ‌! ఎంత మాయ‌కారి కాక‌పోతే... వ‌రుస‌గా అన్ని విజ‌యాలు సాధ్య‌మ‌వుతాయి?? ఒక‌టా రెండా..?? చేసిన ప్ర‌తి సినిమా హిట్టే. ఒక మెట్టు త‌ర‌వాత మ‌రో మెట్టు ఎక్కుతారంతా! కానీ మెట్లు వ‌దిలి మేఘాలు దాటి, ఆ కాశంలో కూర్చున్నాడు. మోళి కాక‌పోతే మ‌రేంటి??

సినిమా టికెట్టు కొన‌డం, థియేట‌ర్లో కూర్చోవ‌డం వ‌ర‌కే మ‌న‌కు గుర్తుంటుంది. ఆ త‌ర‌వాత మ‌న‌ల్ని స్వాధీనం చేసుకొంటాడు రాజ‌మౌళి. మ‌న‌ల్ని ఆడిస్తాడు, ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాడు! రాజ‌మౌళి సినిమాకెళ్తే.. హీరోని పిచ్చ‌పిచ్చ‌గా ఆరాధించ‌డం మొద‌లెడ‌తాం. హీరోయిజంలో ఇంత కిక్కుందా అనిపిస్తుంది. ఒక్కోసారి ఆ దేవుడు కంటే హీరోనే బ‌ల‌వంతుడు అనిపిస్తుంది. అలా న‌మ్మించ‌గ‌ల‌డు. మిగ‌తా ద‌ర్శ‌కులు ఇది అసాధ్యం.. రాజ‌మౌళికి త‌ప్ప‌... ఇంత‌కంటే మాయ మ‌రోటి ఉంటుందా..?.

రావ‌ణాసురుడు బ‌ల‌వంతుడు కాబ‌ట్టే రాముడికి అంత పేరొచ్చింది!
- రాజ‌మౌళి న‌మ్మేసూత్రం ఇదే. విల‌న్ స్ట్రాంగ్ అయితేనే, హీరో స్ట్రాంగాతి స్ట్రాంగ్ అవుతాడు. అందుకే రాజ‌మౌళి సినిమాలో విల‌న్లు అంత‌లా గుర్తుండిపోతారు. రాజ‌మౌళి సినిమాల్లో హీరోకి రెండు పార్శ్వాలుంటాయి. స్టూడెంట్ నెంబ‌ర్‌వ‌న్‌, సింహాద్రి, ఛ‌త్ర‌ప‌తి, విక్ర‌మార్కుడు.. ఇలా ఏ సినిమా అయినా తీసుకోండి. ఆ ల‌క్ష‌ణం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఒక పార్శ్వం విల‌న్‌కో, ప‌రిస్థితుల‌కో లోబ‌డి త‌ల‌వొంచేది. మ‌రోటి... ఆకాశాన్ని సైతం కింద‌కు దించే... ప‌వ‌ర్‌! రాజ‌మౌళి సినిమాలో చివ‌రి వర‌కూ విల‌న్‌దే ఆధిప‌త్యం! కానీ ఏదో ఓసారి హీరో తిర‌గ‌బ‌డ‌తాడు. తోలు తీస్తాడు. అదీ మామూలుగా ఉండ‌దు.. జింతాత జితా జితానే.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త‌క‌ల‌రింగు ఇచ్చాడు ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు. అత‌ని శిష్యుడు క‌దా.. నాలుగు ఆకులు ఎక్కువే చ‌దివొచ్చాడు. క‌మ‌ర్షియాలిటీకి ఆధునిక‌త అద్దాడు! అందుకే రాజ‌మౌళి సినిమాలు టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటాయి.రాజ‌మౌళికీ, ఈనాటి మిగిలిన ద‌ర్శ‌కుల‌కీ తేడా ఏంటంటే, చాలామంది హీరోల కోసం వెదుతుతారు.రాజ‌మౌళి మాత్రం హీరోల్ని సృష్టించుకొంటాడు. మ‌ర్యాద రామ‌న్న‌, ఈగ అందుకు సాక్ష్యాలు. ఈగ‌తో సినిమా తీయ‌డం ఏంటండీ..?? ఈగ‌ని మాస్ హీరోని చేయ‌డం ఏంటంటీ...? రాజ‌మౌళిలోని మోళి ఇక్క‌డే బయ‌ట‌ప‌డింది.

సినిమా త‌ప్ప మ‌రో ప్ర‌పంచం తెలీదంటారు రాజ‌మౌళికి. ఆయ‌న‌తో ప‌నిచేసిన వాళ్లు, చేస్తున్న‌వాళ్లూ ఇదే చెప్తారు. సినిమాలో ప‌డి, అందులో మున‌కేసి, అదే క‌ల‌కంటూ... క‌న్న‌క‌ల‌ని సినిమాగా తీస్తూ.. షాక్‌ల మీద షాక్‌లిస్తున్నాడు జక్క‌న్న‌! రేపు బాహుబ‌లి, ఆ త‌ర‌వాత స్టార్ హీరోని ప‌ట్టుకొన్నా, కొత్త మొహాన్ని ఎంచుకొన్నా - రాజ‌మౌళి సినిమాల‌కు ఉండే క్రేజ్ మ‌రో ప‌దింత‌లు పెరుగుతుంది కానీ, త‌గ్గ‌దు. ద‌టీజ్ రాజ‌మౌళి!

హిట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు, తెలుగు సినిమా స్టామినాని మ‌రో ప‌దింత‌లు చేసిన ద‌ర్శ‌క ధీరుడు! అందుకే తెలుగు సినీ ప్ర‌పంచం మొత్తం.. అత‌ని వంక ఆశ‌గా ఎదురుచూస్తోంది. ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో అని. ఇంకెంత మాయ చేస్తాడో అని. ఆ మాయ‌కి బాహుబ‌లి నిద‌ర్శ‌నం కావాలి. మ‌రో అద్భుతానికి తెర లేపాలి. అలాంటి రోజు కోసం ఎదురుచూస్తూ...
జ‌క్క‌న్న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.