English | Telugu

బ్ర‌హ్మీ పుస్త‌కం రాస్తున్నాడు

టాలీవుడ్ లో కామెడీ కింగ్ ఎవ‌రంటే.. బ్ర‌హ్మానందం పేరే చెప్పాలి. ఏ సినిమా చూసినా ఆయ‌నే. ఆయ‌న పాత్ర క్లిక్ అయితే సినిమా హిట్టే. సెకండాఫ్ అంతా సినిమాని భుజాల‌వై వేసుకొని న‌డిపించేసే స‌త్తా ఉంది. పిండుకొనే సత్తా ఉండాలేగానీ.. ఎన్ని న‌వ్వులైనా అందిస్తారాయ‌న‌. అత్య‌ధిక సినిమాల్లో న‌టించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్ కూడా ఆయ‌నదే. త్వ‌ర‌లోనే 1000 సినిమాల మైలు రాయి చేరుకోబోతున్నారు. ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మీ ఓ పుస్త‌కం రాయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇది ఆయ‌న జీవిత క‌థ‌. ఈ 1000 సినిమా ప్ర‌యాణాన్ని ఆయ‌న అక్ష‌ర రూపంలో పొందుప‌ర్చ‌నున్నారు. బ్ర‌హ్మీకి అంద‌రితోనూ స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఆయ‌న అజాత శ‌త్రువు కూడా. అందుకే ఈ పుస్త‌కం ద్వారా విలువైన‌, ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌టకొచ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న‌ఖాళీ స‌మ‌యాల్లో క‌లం ఝులిపిస్తున్నార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే ఈ పుస్త‌కం గురించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి. బ్ర‌హ్మీ న‌ట‌నే కాదు, అక్ష‌రాలూ న‌వ్విస్తాయేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.