English | Telugu

నా అంతరాత్మ ఒక స్వర్ణయుగం.. భాగ్యశ్రీ బోర్సే మొత్తం చెప్పేసింది 

-భాగ్యశ్రీ బోర్సే ఏం చెప్పింది!
-కాంత గురించి ఏమంటుంది
-ఖుష్బూ చెప్పిన విషయాలు ఏంటి!

అందంతో పాటు అందానికి తగ్గ అభినయం కలగలిపిన నటీమణులు పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై ఎంతో రేర్ గా తళుక్కుమంటారు. అభిమానులు ప్రేక్షకులు కూడా సదరు నటీమణులని దేవకన్యల్లాగా భావిస్తారు. అలాంటి ఒక దేవకన్యే 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri Borse). అందుకే మొదటి చిత్రం మిస్టర్ బచ్చన్ పరాజయం పాలైనా వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తన అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ఈ నెల 14 న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)తో కలిసి చేసిన 'కాంత' తో తమిళ, తెలుగు, మలయాళ ప్రేక్షకులని పలకరించనుంది.

ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ వస్తుంది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతు 'కాంత'(Kaantha)తోనే నేను దక్షిణాదికి పరిచయం కావాల్సింది. నేను విన్న మొట్టమొదటి సబ్జెక్టు కూడా ఇదే. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. 1950 ,60 వ కాలం నేపథ్యంలో జరిగే కథలో నా క్యారక్టర్ పేరు కుమారి. సదరు క్యారక్టర్ చెయ్యడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అలనాటి హీరోయిన్స్ లాగా కళ్ళతోనే భావాలు పలికించాలి. ఇందుకోసం సావిత్రి, శ్రీదేవి గారి సినిమాలు చూడటంతో పాటు కొంత మంది మనుషులని కూడా కలిసాను. ఇప్పుడు పలికే సంబాషణలకి, నాటి తరం సంబాషణలకి చాలా తేడా ఉంది. అందుకే సంభాషణలు స్పష్టంగా చెప్పడానికే ఆరు నెలల సమయం తీసుకున్నాను.

ఈ మధ్య సీనియర్ నటీమణి ఖుష్బూ గారిని కలిసాను. ఆమె నాతో మాట్లాడుతు సోషల్ మీడియా లేని రోజుల్లో జీవితం ఎంత వైవిధ్యంగా ఉండేదో, ప్రస్తుతం సోషల్ మీడియా మోజులో పడి మనం ఎలాంటి ఆనందమైన జీవితాన్ని అనుభవించలేకపోతున్నామో చెప్తుంటే ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. ఆ కాలాన్నిస్వర్ణ యుగం అని ఎందుకు కూడా అంటారో కూడా 'కాంత' ద్వారా అర్ధమయింది. నా అంతరాత్మ మాత్రం అప్పటి కాలానికి దగ్గరగానే ఉంటుందని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. మహారాష్ట్ర లోని పూణే భాగ్యశ్రీ స్వస్థలం కాగా 'రామ్ పోతినేని'(Ram Pothineni)తో చేసిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో ఈ నెల 28 న మరో మారు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .