English | Telugu

పౌరుషంతో పొగరుగా రాజకీయాల్లోకి వస్తానంటున్న బండ్లన్న!

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయం చెప్పారు. మొదట "నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం" అని ట్వీట్ చేసిన ఆయన, ఆ తర్వాత "నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా" అన్నారు. "బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై" కొట్టారు.

అంతటితో ఆయన ఆగలేదు. "రాజకీయాలంటే నిజాయితీ.. రాజకీయాలంటే నీతి.. రాజకీయాలంటే కష్టం.. రాజకీయాలంటే పౌరుషం.. రాజకీయాలంటే శ్రమ.. రాజకీయాలంటే పోరాటం.. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి.. అందుకే వస్తా" అని ప్రకటించారు.

జనసేనాని పవన్ కల్యాణ్‌ను దేవునిగా, తను ఆయనకు పరమ భక్తునిగా బండ్ల గణేశ్ చెప్పుకుంటూ రావడం మనకు తెలుసు. రీసెంట్‌గా పవన్ కల్యాణ్, "కర్ణాటకలో కుమారస్వామి గారి లాగా 30-40 సీట్లను గెలుచుకోగలిగితే, మన మిత్ర పక్షాలను సీఎం అభ్యర్థి రోల్ కోసం డిమాండ్ చేయగలం, లేకపోతే మనం డిమాండ్ చెయ్యలేం" అని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో "బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై" అని బండ్ల గణేశ్ ట్వీట్ చేయడం గమనార్హం. దాన్ని బట్టి ఆయన జనసేనలో కాకుండా వేరే పార్టీలో చేరతారా అనే అభిప్రాయం కలుగుతోంది. చూద్దాం.. బండ్లన్న నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తారో...

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .