English | Telugu

అలాంటి జర్నలిజం విలువలు ఇక్కడెప్పుడొస్తాయో?

అనసూయ ఈ మధ్య తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఆంటీ హాష్ టాగ్ తో ట్రోల్ అవుతూ ఉంటుంది. అలా ట్రోల్ చేసేవాళ్లకు ట్విట్టర్ వేదికగా గట్టిగా వార్నింగ్ లు కూడా ఆమె ఇస్తుంది. అలాంటి అనసూయ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక కామెంట్ పెట్టింది..."ఇలాంటి బాధ్యతాయుతమైన జర్నలిజం విలువలు ఇక్కడ ఎప్పుడు వస్తాయో" అని. దాని పైన ప్రియాంక చోప్రాకి జరిగిన రెడ్ కార్పెట్ ఇష్యూ ఫోటోని టాగ్ చేసింది. ఆ ఇష్యూ గురించి చెప్పుకోవాల్సి వస్తే హాలీవుడ్ ప్రాజెక్ట్ 'లవ్ అగైన్' ప్రొమోషన్స్ లో భాగంగా ప్రియాంక చోప్రా న్యూయార్క్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ అంతా ప్రెస్ వాళ్ళ హడావిడి ఎక్కువగా ఉంది. అలా ఆమె రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఆమెను ఫొటోస్ తీస్తున్నారు. ఆ టైంలో ఆమె వేసుకున్న హైహీల్స్ కారణంగా ఆమె కాలుజారి రెడ్ కార్పెట్ మీద కింద పడిపోయి చాలా ఇబ్బంది పడింది.

తనను ఆ యాంగిల్ లో ఫొటోస్ తీస్తున్నారేమో అని భయపడింది. కానీ ఫోటోగ్రాఫర్స్ అంతా ఆ ఇన్సిడెంట్ చూసి వాళ్ళ వాళ్ళ కెమేరాస్ ని కిందకి దించేశారు..కంగారు పడకండి జాగ్రత్తగా నిలబడండి అంటూ ఆమెను లేపి నిలబెట్టారు..ఇదంతా మనకు తెలుసు. ఈ విషయానికి సంబంధించి ఆమె ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తూ " నా 23 ఏళ్ళ కెరీర్ లో ఇలాంటి సంఘటన నేనస్సలు చూడనే లేదు. సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు నేను కిందపడిపోయినట్టుగా ఉన్న ఒక్క క్లిప్ కానీ ఫోటో కానీ బయటకు రాలేదు" అని హ్యాపీ ఫేస్ తో చెప్పింది. ఇదే విషయాన్ని అనసూయ మెన్షన్ చేస్తూ మన దగ్గర అలాంటి జర్నలిజం విలువలు లేవు అని ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇక్కడ ఏ చిన్న మాట మాట్లాడిన ఏ చిన్న కామెంట్ పెట్టిన దాన్ని చిలువలు పలువులు చేసి ట్రోల్ చేస్తారు అని చెప్పకనే చెప్పింది అనసూయ.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.